LS polls: ముగిసిన ఆరో దశ ప్రచారం.. అందరి చూపు ఎర్రకోట వైపు!
దేశ రాజధానిలో ఏడు లోక్సభ స్థానాలకు ఒకేరోజు పోలింగ్ ఉండడంతో అందరి చూపు ఎర్రకోట వైపు మళ్లింది.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా ఆరో దశ ప్రచారానికి గడవు ముగిసింది. ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. హరియాణా, పంజాబ్, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన పలు పార్టీల అగ్రనేతలు.. ప్రచారంతో హోరెత్తించారు. ఈ క్రమంలో దేశ రాజధానిలో ఏడు లోక్సభ స్థానాలకు ఒకేరోజు పోలింగ్ ఉండడంతో అందరి చూపు ఎర్రకోట వైపైనే ఉంది.
దిల్లీలో ఏడు లోక్సభ స్థానాలుండగా.. ఆరో దశలో ఒకేరోజు అక్కడ పోలింగ్ జరగనుంది. మొత్తం 1.52 కోట్ల మంది ఓటర్ల కోసం 13వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 162 మంది బరిలో ఉన్నారు. దాదాపు లక్ష మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
మోదీ పరివార్..
దేశ రాజధాని దిల్లీలో మోదీ పరివార్ ముమ్మర ప్రచారం చేసింది. ప్రధానమంత్రి రెండు బహిరంగ సభల్లో పాల్గొనగా.. కేంద్రహోం మంత్రి అమిత్ షా కూడా ముమ్మర ప్రచారం చేశారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్లు రాజధానిలో చివరి రోజు సుడిగాలి పర్యటనలు చేశారు. వీరితోపాటు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్లు ప్రచారాల్లో మునిగిపోయారు.
‘ఇండియా’ జోరు..
కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ, సచిన్ పైలట్లు నగరంలో ముమ్మర ప్రచారం చేశారు. నార్త్వెస్ట్ దిల్లీలోని మంగోల్పురి, నార్త్ ఈస్ట్ దిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ప్రాంతాల్లో రాహుల్ ప్రచారం నిర్వహించారు. మెట్రో రైల్లో వెళ్లిన ఆయన.. ప్రయాణికులతో ముచ్చటించారు. నగరంలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలోనూ రాహుల్ పాల్గొన్నారు.
Deve Gowda: లొంగిపో.. లేదంటే..! ప్రజ్వల్కు మాజీ ప్రధాని వార్నింగ్
మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించగా.. ఆప్ అభ్యర్థికి మద్దతుగా సచిన్ పైలట్ ప్రచారం చేశారు. ఇక్కడ ఆప్ మూడు చోట్ల పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నాలుగు స్థానాలో బరిలో నిలిచింది. కేజ్రీవాల్ రాకతో అక్కడి ఆప్ కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపించింది. అంతకుముందు దిల్లీ సీఎం తరఫున ఆయన భార్య సునీత ప్రచారం చేయగా.. భారీ స్పందన కనిపించింది.
మరోవైపు, బిహార్లో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటి పరిధిలో 1.5కోట్ల మంది ఓటర్లు ఉండగా..86 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హరియాణాలో మొత్తం 10లోక్సభ స్థానాలతోపాటు కర్నాల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఉప ఎన్నిక బరిలో ఉండగా.. మాజీ సీఎం మనోహర్లాల్ ఖట్టర్, ఇద్దరు కేంద్ర మంత్రులతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలకు ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వీటితోపాటు ఒడిశా, పశ్చిమబెంగాల్లోని పలు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Andhra News: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. -
ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్
ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. -
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ ధన్యవాదాలు తెలిపారు. -
ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్పై మరోసారి దర్యాప్తు జరపాలి
విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు, ఆయన సహచరుడు జీవీ కిడ్నాప్ కేసును మరోసారి దర్యాప్తు చేయాలని జనసేన నాయకుడు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. -
నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలివి
జల్జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీశాఖల మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. -
పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్?
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లు తెలిసింది. -
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కూలడం తథ్యం: ఖర్గే
‘సంపూర్ణ ఆధిక్యం లేకుండానే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. పొరపాటున ఏర్పాటైన ఈ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చ’ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. -
జగన్ది నీచ రాజకీయం: మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్
ఎంపీలు 22 మంది ఉన్నా ఐదేళ్లలో ఏనాడూ ప్రత్యేక హోదాపై నోరెత్తని వైకాపా అధినేత జగన్.. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. -
పుంగనూరులో ఉద్రిక్తత.. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ తెదేపా కార్యకర్తల ర్యాలీ
చిత్తూరు జిల్లా పుంగనూరులో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రావడానికి వీల్లేదంటూ తెదేపా నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీయేకు అధికారం ఖాయం
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీయే) సాధించిన విజయం ఆరంభం మాత్రమేనని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. -
ఇందిరాగాంధీ మదర్ ఆఫ్ ఇండియా
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఆఫ్ ఇండియాగా కేంద్ర మంత్రి, కేరళలోని త్రిశ్శూర్ భాజపా ఎంపీ సురేశ్ గోపి అభివర్ణించారు. -
బెంగాల్ దాడుల అధ్యయనానికి కమిటీ: భాజపా
పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం తమ పార్టీ కార్యకర్తలు లక్ష్యంగా జరుగుతున్న హింసపైన అధ్యయనానికి భాజపా నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. -
భాజపాతో విభేదాల్లేవ్
భాజపాతో ఎటువంటి విభేదాల్లేవని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. ఇటీవల సంఘ్ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ వివరణ ఇచ్చింది. -
తప్పు చేయకపోతే... కమిషన్ ముందు నిరూపించుకోవచ్చు కదా?
విద్యుత్ కొనుగోలులో తప్పు చేయకపోతే కమిషన్ ముందు హాజరై నిరూపించుకోవచ్చు కదా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
జస్టిస్ నరసింహారెడ్డి కమిటీని కేసీఆర్ రద్దు చేయమనడం విడ్డూరం
భారాస పార్టీని భాజపాలో విలీనం చేయడానికి భారాస లోపాయికారీగా చర్చలు జరుపుతుందని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కోడెలపై పెట్టిన సెక్షన్లతోనే జగన్పైనా కేసు పెట్టాలి
తాడేపల్లిలోని తన ఇంటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ అప్పట్లో రూ.18 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారని, దాంతోనే అక్కడ విద్యుత్ ఫెన్సింగ్ సహా పలు రకాల సామగ్రి సమకూర్చుకున్నారని, ఆ సామగ్రిని ప్రభుత్వానికి అప్పగించకపోగా.. అదే ఇంట్లో ఇప్పుడు పార్టీ కార్యకలాపాలు నిర్వహించడమేంటని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం ధ్వజమెత్తారు. -
జగన్ది నీచ రాజకీయం: మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్
ఎంపీలు 22 మంది ఉన్నా ఐదేళ్లలో ఏనాడూ ప్రత్యేక హోదాపై నోరెత్తని వైకాపా అధినేత జగన్.. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. -
ఆర్టీసీ ఐ-టిమ్స్ టెండర్లలో కుంభకోణం
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా... గత ఆరు నెలల పాలనలో వరస కుంభకోణాలకు పాల్పడిందని భారాస పేర్కొంది. మద్యం, బియ్యం, ఫ్లైయాష్, తాజాగా ఆర్టీసీ ఐ-టిమ్స్ టెండర్ల భారీ కుంభకోణం జరిగిందని భారాస నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..