Deve Gowda: లొంగిపో.. లేదంటే..! ప్రజ్వల్కు మాజీ ప్రధాని వార్నింగ్
ప్రజ్వల్ ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. విదేశాల్లో ఉన్న ఆయనను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. ఆయన కుటుంబీకుల నుంచి వరుస విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మరోసారి స్పందించారు. ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని, లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ప్రజ్వల్ను హెచ్చరిస్తూ ఎక్స్లో సుదీర్ఘ లేఖ పోస్టు చేశారు.
సహనాన్ని పరీక్షించొద్దు..
‘‘ప్రజ్వల్ రేవణ్ణ గురించి మే 18న ఓ ఆలయానికి వెళ్తూ మీడియాతో మాట్లాడా. అతడు నాకు, నా కుటుంబం, పార్టీ, శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ కేసులో దోషిగా తేలితే కఠినశిక్ష పడాల్సిందే. నా కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి కూడా ఇదే వైఖరితో ఉన్నాడు. ప్రజ్వల్.. ఎక్కడున్నా వచ్చి పోలీసుల ముందు లొంగిపో. నా సహనాన్ని పరీక్షించవద్దు. ఇది నా విజ్ఞప్తి కాదు.. వార్నింగ్. లేదంటే నాతో పాటు కుటుంబసభ్యుల ఆగ్రహానికి గురవుతావ్’ అని హెచ్చరిక లేఖలో దేవెగౌడ పేర్కొన్నారు.
హద్దులు దాటి వధువుకు ‘కిస్సు’.. ఇరుకుటుంబాలు కస్సు బుస్సు
కొన్ని వారాలుగా ప్రజలు తనపై, తన కుటుంబంపైనా కఠిన పదాలు వాడుతున్న విషయం తెలుసునని దేవెగౌడ వెల్లడించారు. వాస్తవాలు బయటకు వచ్చేవరకు వాటిని ఆపాలని వారికి చెప్పడం ఇష్టం లేదన్నారు. అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలు తనవెంటే ఉన్నారన్న ఆయన.. వారికి ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. వారి విశ్వాసాన్ని తిరిగి పొందడమే తనకు ముఖ్యమని మాజీ ప్రధాని స్పష్టంచేశారు. అంతకుముందు ఈ విషయంపై మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. తాతపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. అశ్లీల వీడియోల కేసు అందరినీ తల దించుకునేలా చేసిందని, ఈ ఘటనకు తాను బేషరతుగా ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్ చుక్ పరుగులు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణపనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
రాష్ట్రం కోసం నీతీశ్ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్ కిషోర్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్..8మంది నక్సల్స్ మృతి
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. -
‘ఆ వీడియో తొలగించండి’: సునీతా కేజ్రీవాల్కు దిల్లీ కోర్టు నోటీసులు
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో విషయంలో సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal)కు దిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. -
అనుచిత వ్యాఖ్యలు చేసి.. యూటర్న్ తీసుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్ సీనియర్ల నుంచి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు వెలువడ్డాయి. అవి వివాదాస్పదం కావడంతో తాజాగా వివరణ వచ్చింది. -
అక్రమాలు జరిగితే ఎన్టీఏను జవాబుదారీ చేస్తాం
పరీక్షల నిర్వహణలో అక్రమాలను తమ ప్రభుత్వం సహించబోదని, ఒక వేళ లోపాలు జరిగినట్లు తేలితే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని జవాబుదారీ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. -
బుల్లెట్ రైలులో ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ
బుల్లెట్ రైలు సేవలను సురక్షితంగా నిర్వహించేందుకు ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ(రెయిన్ఫాల్ మానిటరింగ్ సిస్టమ్)ను అవలంబిస్తున్నామని శుక్రవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. -
శివునికి ఎవరి రక్షణా అవసరం లేదు
యమునా నది వరదకు గురయ్యే తీర భూమిలో గల ప్రాచీన శివాలయాన్ని కూల్చివేయాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది. -
త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు జమిలి ఎన్నికల కమిటీ నివేదిక
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు రానుంది. -
భాజపాతో ఆరెస్సెస్కు విభేదాల్లేవు.. సంఘ్ వర్గాల వెల్లడి
భాజపాతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు ఎటువంటి విభేదాల్లేవని సంబంధిత వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2014, 2019 లోక్సభ ఎన్నికల తరవాత ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన ప్రసంగానికి తాజాగా ఆయన మాట్లాడిన మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదని పేర్కొన్నాయి. -
అమెరికాలో వర్క్ పర్మిట్దారుల పిల్లలను ఆదుకోండి
అమెరికాకు వర్క్పర్మిట్పై వచ్చిన దంపతుల పిల్లల(డ్రీమర్ల)కు 21 ఏళ్లు నిండగానే వారివారి దేశాలకు తిప్పిపంపేయకుండా తక్షణం రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు 43 మంది శాసనకర్తలు విజ్ఞప్తి చేశారు. -
యడియూరప్పకు కోర్టులో ఊరట
మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను అరెస్టు చేయవద్దని సదాశివనగర పోలీసులను ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. -
నీట్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-యూజీ(2024) పరీక్షలో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
కేంద్ర మంత్రి సోమణ్ణ కుమారుడిపై కేసు
రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ కుమారుడు అరుణ్, ఆయన సహచరుడు ప్రమోద్రావుపై బెంగళూరు సంజయనగర ఠాణాలో కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు. -
బహుముఖాలను గుర్తించే ఏఐ టూల్
ఒకేసారి అత్యంత కచ్చితత్వంతో బహుముఖాలను గుర్తించగలిగేలా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్ని ఒక స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది. శివానీ వర్మ అనే మహిళ నేతృత్వంలోని ఈ స్టార్టప్ తీసుకొచ్చిన టూల్ను ‘దివ్య దృష్టి’ పేరుతో పిలుస్తున్నారు. -
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది
యాత్రికుల బస్సు లోయలో పడినా, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఉన్నారని జమ్మూ కశ్మీర్లో చోటుచేసుకున్న ఘటనలో గాయపడిన ఓ బాధితురాలు వాపోయారు. -
చాంద్నీ చౌక్లో భారీ అగ్నిప్రమాదం
ఉత్తర దిల్లీలోని చాంద్నీ చౌక్ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50కిపైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. -
షీనాబోరా అస్థికలు మాయం
ఇరవై నాలుగేళ్ల షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న మృతురాలి అస్థికలు మాయమైనట్లు దర్యాప్తు అధికారులు సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
ఆర్మీ అమ్ములపొదిలో ‘నాగాస్త్ర-1’
భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. మహారాష్ట్ర నాగ్పుర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-1’ సైన్యం చేతికి వచ్చింది. -
తేనెటీగల దాడి.. పీపీఈ కిట్లుధరించి దహన సంస్కారాలు
తేనెటీగలు దాడి చేయడంతో పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఝార్ఖండ్లో రూ.2 లక్షల వరకూ రైతు రుణాల మాఫీ
రైతులకు గల రూ.రెండు లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ఝార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయమంత్రి బాదల్ పత్రలేఖ శుక్రవారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్ చుక్ పరుగులు!
-
‘కాలర్ ఐడీ’పై ట్రయల్స్ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు
-
రాష్ట్రం కోసం నీతీశ్ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్ కిషోర్
-
విఘ్నేశ్తో గొడవపై స్పందించిన విజయ్ సేతుపతి.. ఏమన్నారంటే
-
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ..
-
లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగింపు