AP LOK SABHA: భారీ ఆధిక్యంతో.. కూటమి ఎంపీ అభ్యర్థులదే హవా
AP LOK SABHA: ఏపీలో లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 25 స్థానాలకు గాను తెదేపా 16చోట్ల గెలిచి ప్రభంజనం సృష్టించింది. భాజపా మూడు స్థానాలు గెలుచుకోగా.. జనసేన 2 స్థానాల్లో జయకేతనం ఎగురవేశాయి. వైకాపా నాలుగు స్థానాలకే పరిమితమైంది. విశాఖ తెదేపా అభ్యర్థి భరత్ 5లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. కూటమి అభ్యర్థుల్లో చాలా మంది 2లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించడం విశేషం. ఏపీలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం..
- విశాఖపట్నంలో తెదేపా అభ్యర్థి మతుకుమిల్లి భరత్ రికార్డు స్థాయిలో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిపై 5,04,247 ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు.
- గుంటూరులో తెదేపా అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ వైకాపా అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై భారీ విజయం సాధించారు. 3,44,695 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం.
- అమలాపురంలో తెదేపా అభ్యర్థి గంటి హరీష్ వైకాపా అభ్యర్థి రాపాక వరప్రసాదరావుపై విజయఢంకా మోగించారు.తన ప్రత్యర్థిపై 3,42,196 ఓట్ల మెజార్టీ సాధించారు.
- శ్రీకాకుళంలో తెదేపా అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు వైకాపా అభ్యర్థి పేరాడ తిలక్పై దాదాపు 3లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- విజయవాడలో తెదేపా అభ్యర్థి కేశినేని చిన్ని తన సోదరుడు కేశినేని నానిపై 2,82,085 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
- నరసాపురంలో భాజపా అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- నెల్లూరులో తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డిపై 2,45,902 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- విజయనగరంలో తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు వైకాపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్పై దాదాపు 2.4లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- రాజమండ్రిలో భాజపా అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి గూడూరి శ్రీనివాసులుపై 2.31లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- కాకినాడలో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) భారీ విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి చలమశెట్టి సునీల్పై 2,29,491 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
- చిత్తూరులో తెదేపా అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి ఎన్.రెడ్డప్పపై 2,20,479 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
- అనకాపల్లిలో భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుపై దాదాపు 2లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
- బాపట్లలో తెదేపా అభ్యర్థి టి.కృష్ణప్రసాద్ వైకాపా అభ్యర్థి నందిగం సురేష్పై దాదాపు రెండు లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
- మచిలీపట్నంలో జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపొందారు. వైకాపా అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావుపై బాలశౌరి 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించారు.
- అనంతపురంలో తెదేపా అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఘన విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి ఎం.శంకరనారాయణపై 1,88,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- ఏలూరులో తెదేపా అభ్యర్థి పుట్టా మహేశ్ యాదవ్ గెలుపొందారు. వైకాపా అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్పై 1,81,857 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- నరసరావుపేటలో తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వైకాపా అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్పై 1,59,729 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
- తిరుపతిలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి భాజపా అభ్యర్థి వరప్రసాదరావుపై 1.45లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
- నంద్యాలలో తెదేపా అభ్యర్థి భైరెడ్డి శబరి వైకాపా అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిపై గెలుపొందారు. శబరి 1,11,975 ఓట్ల మెజార్టీ సాధించారు.
- కర్నూలులో తెదేపా అభ్యర్థి బస్తిపాటి నాగరాజు వైకాపా అభ్యర్థి బీవై రామయ్యపై 1,11,298 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
- హిందూపురంలో తెదేపా అభ్యర్థి బీకే పార్థసారథి వైకాపా అభ్యర్థి శాంతపై విజయం సాధించారు. దాదాపు లక్ష ఓట్లకు పైనే మెజార్టీ సాధించారు.
- కడపలో వైకాపా అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డిపై 62వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షరాలు షర్మిలకు 1,41,039 ఓట్లు వచ్చాయి.
- రాజంపేటలో వైకాపా అభ్యర్థి మిథున్ రెడ్డి భాజపా అభ్యర్థి కిరణ్కుమార్ రెడ్డిపై 76,071 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
- అరకులో వైకాపా అభ్యర్థి తనూజారాణి చేతిలో భాజపా అభ్యర్థి కొత్తపల్లి గీత ఓటమిపాలయ్యారు. తనూజా రాణికి 50,580 ఓట్ల మెజార్టీ వచ్చింది.
- ఒంగోలులో తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై 48 వేల పైచీలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు