Kangana Ranaut: కంగన రనౌత్ ప్రత్యర్థిగా మినిస్టర్..!
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని మండిలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అక్కడ కంగన (Kangana Ranaut)తో ఆ రాష్ట్ర మంత్రి పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది.
దిల్లీ: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని మండి (Mandi) నుంచి భాజపా (BJP) లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగిన సినీనటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారికి దీటుగా బదులిస్తున్నారు. ఆ స్థానం నుంచి ఆ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ బరిలో నిలవనున్నారు. ఈ విషయాన్ని ఆయన తల్లి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభాసింగ్ వెల్లడించారు. జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. కుమారుడి అభ్యర్థిత్వం గురించి మాట్లాడుతూ.. మండి ప్రజలు ఎప్పుడూ తమతోనే ఉన్నారని వెల్లడించారు. తన కుమారుడికి వ్యతిరేకంగా కంగన చేసే వ్యాఖ్యలను తాను పట్టించుకోనన్నారు. ఎంతో క్లిష్ట సమయంలో కూడా తాను ఇక్కడినుంచి గెలిచినట్లు చెప్పారు. ఆమె మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి. మండి సిట్టింగ్ ఎంపీ.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల కంగన, విక్రమాదిత్యల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె వివాదాల రాణి అని, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు తలెత్తుతుంటాయని వ్యాఖ్యానించారు. అలాగే ఆమె బీఫ్ తిననంటూ చేసిన పోస్టపై స్పందిస్తూ.. ‘‘ఆమెకు బుద్ధి ప్రసాదించాలని రాముడిని ప్రార్థిస్తున్నా. ఆమె దేవభూమి హిమాచల్ నుంచి బాలీవుడ్కు స్వచ్ఛంగా తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ఆమెకు ఏమీ తెలియదు. ఆమె ఎన్నికల్లో గెలవరు’’ అని వ్యాఖ్యానించారు. దీనికి నటి కౌంటర్ ఇచ్చారు. ఈ రాష్ట్రం ఆయన తాతల ఎస్టేట్ ఏమీ కాదని, తనను బెదిరించి వెనక్కి పంపించలేరన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, విక్రమాదిత్య సింగ్లను కంగన ‘పప్పూ’గా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు