Exit polls: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడెలా?
Exit polls: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడెలా?
Exit polls | ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికలు ముగిసిన వెంటనే వెలువడే ఎగ్జిట్ పోల్స్పై (Exit polls) ప్రజల్లో సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారో వేసే ఈ అంచనాలకు ఇటీవల కాలంలో మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరింది. జూన్ 1న ఏడోవిడత పోలింగ్ ముగియనుంది. అదేరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఈనేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్లో ఎన్నిసార్లు నిజమయ్యాయి? ఎన్ని బోల్తా కొట్టాయ్?
నిజమైన వేళ..
- 1996: సీఎస్డీఎస్ అనే సంస్థ 1996లో లోక్సభ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. తీర్పు అస్పష్టంగా ఉండబోతోందని తెలిపింది. ఆ సంస్థ అంచనా వేసినట్లుగానే ఫలితాలు వచ్చాయి.
- 1998: లోక్సభ ఎన్నికల్లో చాలా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. భాజపాకు 200పైచిలుకు సీట్లు వస్తాయని వెల్లడించాయి. భాజపా కూటమి మెజారిటీకి దగ్గరగా వస్తుందని తెలిపాయి. అన్నట్లుగానే 1998లో భాజపా కూటమికి 252 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 166 సీట్లు దక్కాయి. ఇతరులకు 119 సీట్లు వచ్చాయి.
- 2014: లోక్సభ ఎన్నికల్లో పలు సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మారబోతోందంటూ పలు సంస్థలు చెప్పాయి. అన్నట్లుగానే ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఓ సంస్థ ఈ కూటమికి 340 సీట్లు వస్తాయని అంచనా వేయగా 334 వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 70 సీట్లే వస్తాయని చెప్పగా 60 వచ్చాయి.
- 2019: ఈ లోక్సభ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. భాజపాకు 336, 339-365 సీట్లు వస్తాయని రెండు సంస్థలు చెప్పగా 353 సీట్లతో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. యూపీఏకు 82 సీట్లు వస్తాయని అంచనా వేయగా దాదాపుగా అంతే వచ్చాయి.
- 2021: కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు ఎగ్జిట్ పోల్స్ లెక్కలు నిజమయ్యాయి. కేరళలో ఎల్డీఎఫ్కు అధికారం వస్తుందని చెప్పగా అదే జరిగింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్దే విజయమని ఒకటి రెండు సంస్థలు చెప్పగా నిజమైంది. అదే సమయంలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు కావడం గమనార్హం.
- 2023: తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. అనుకున్నట్లుగానే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఒపీనియన్ పోల్కు ఎగ్జిట్ పోల్కు మధ్య వ్యత్యాసం ఏంటి?
తారుమారైన వేళ..
- 2004: ఎనిమిది నెలల ముందుగా లోక్సభను అప్పటి వాజ్పేయీ ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లింది. అంతకుముందుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో విజయం సాధించడంతో అతి విశ్వాసంతో భాజపా కూటమి ఎన్నికలకు వెళ్లింది. ఆ సమయంలో ఎన్డీయేకి 330 సీట్లు వస్తాయని ఒక సంస్థ అంచనా వేయగా మిగిలినవి 270 వస్తాయని పేర్కొన్నాయి. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీయేకి 181 సీట్లే వచ్చాయి.
- 2015: బిహార్, దిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. బిహార్లో భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా జేడీయూ-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పినా మొత్తం 70 సీట్లలో 67 వస్తాయని ఏ సంస్థా అంచనా వేయలేదు.
- 2017: ఉత్తర్ప్రదేశ్లో పలు ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. అయితే భాజపా స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. పంజాబ్లోనూ హంగ్ వస్తుందని పలు సంస్థలు అంచనా వేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారం సాధించింది.
- 2018: ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పలేకపోయాయి. కానీ ఆ పార్టీ భారీ విజయం సాధించింది.
- 2019: మహారాష్ట్ర, హరియాణాల్లో భాజపా అధికారం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కానీ రెండు రాష్ట్రాల్లో హంగ్ అసెంబ్లీలే ఏర్పడ్డాయి.
- 2020: బిహార్లో ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా భాజపా-జేడీయూ కూటమి అధికారం చేజిక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం