Nara lokesh: లోకేశ్‌ సమక్షంలో మంగళగిరి నుంచి భారీగా తెదేపాలోకి చేరికలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో మంగళగిరి నుంచి పెద్ద ఎత్తున పలువురు తెదేపాలో చేరారు.

Updated : 24 Feb 2024 18:42 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో మంగళగిరి నుంచి పెద్ద ఎత్తున పలువురు తెదేపాలో చేరారు. వారికి పసుపు కండువా కప్పి లోకేశ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశంలో ఇప్పటికే పనిచేస్తోన్న నేతలు కొత్త వారితో కలిసి ముందుకు సాగాలని సూచించారు. మంగళగిరి అభివృద్ధి కోసం తన వెంట నడుస్తున్న నేతలకు అభినందనలు తెలిపారు. తాడేపల్లి, మంగళగిరి, చిర్రావూరుకు చెందిన దాదాపు 180 కుటుంబాల వారు పార్టీలో చేరారు. మంగళగిరి నియోజకవర్గానికి తెదేపా-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నారా లోకేశ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని