Congress: ₹500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ₹10వేలు: సీఎం గహ్లోత్ హామీలు
Assembly Elections: రాజస్థాన్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ హామీలు ప్రకటించింది.
జైపుర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో(Rajasthan Assembly polls) కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తోంది. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా గహ్లోత్ సర్కార్ భారీ హామీలను ప్రకటించింది. మళ్లీ కాంగ్రెస్ను గెలిపిస్తే రాష్ట్రంలోని దాదాపు 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500లకే వంట గ్యాస్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్(Ashok Gehlot) ప్రకటించారు. అలాగే, ప్రతి కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10వేలు చొప్పున గౌరవ వేతనంగా ఇస్తామన్నారు. బుధవారం ఝున్ఝునులో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గృహ లక్ష్మీ గ్యారెంటీ పథకంలో భాగంగా మహిళలకు ₹10వేల మొత్తాన్ని వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తామన్నారు.
అధిష్ఠానం ఎక్కడ చేయమంటే అక్కడే పోటీ: కోమటిరెడ్డి
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కేంద్రంలోని భాజపా సర్కార్పై విరుచుకుపడ్డారు. ఎంపిక చేసిన కొందరు పారిశ్రామికవేత్తల కోసమే కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది తప్ప.. ప్రజా సమస్యల్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రజల్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. కేవలం అధికారంలో ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవలనుకుంటున్నారని ఆక్షేపించారు. ఎన్నికల సమయంలో కులం, మతం గురించి మాట్లాడితేనే ఓట్లు పడతాయని భాజపా భావిస్తోందన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులకు విజన్ ఉండాలని.. అప్పుడే ప్రజలకు అభివృద్ధి పనులు చేయగలరని తెలిపారు. కానీ, మోదీ సర్కార్కు ప్రజల అభ్యున్నతిపై దృష్టిలేదని.. కేవలం కొద్ది మంది తమ మిత్రుల కోసం మాత్రమే ప్రధాని పనిచేస్తున్నారని విమర్శించారు. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు కలిగిన రాజస్థాన్ శాసనసభకు నవంబర్ 25న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!