Komatireddy Venkat Reddy: అధిష్ఠానం ఎక్కడ చేయమంటే అక్కడే పోటీ: కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన రెండో విడత జాబితా సిద్ధమవుతుందని.. దాన్ని ఈ నెల 26న అధిష్ఠానం విడుదల చేస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన రెండో విడత జాబితా సిద్ధమవుతుందని.. దాన్ని ఈ నెల 26న అధిష్ఠానం విడుదల చేస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఆరు స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని.. ఆ స్థానాలకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన పలువురు భారాస నేతలు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కాంగ్రెస్లో చాలా మంది చేరుతున్నారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేరిక విషయం తనతో మాట్లాడలేదని.. అధిష్ఠానంతో చర్చించారని చెప్పారు. వామపక్షాలకు నాలుగు సీట్లంటే తక్కువేమీ కాదన్నారు. మిర్యాలగూడ స్థానాన్ని వామపక్షాలు అడిగాయని.. కానీ అక్కడ ఓటు ఎంతవరకు బదిలీ అవుతుందనేది చూడాలన్నారు. పొత్తులపై సాయంత్రానికి క్లారిటీ వస్తుందని చెప్పారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70-80సీట్లు వస్తాయని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనకు అధిష్ఠానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర నేతల అంతమే మోదీ లక్ష్యం
తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. -
విపక్ష నేతలకు రాసిన లేఖపై మీరు స్పందించడం ఆశ్చర్యమే
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలకు తాను రాసిన లేఖపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్, సిసోదియా వంటి వారిని భాజపా ఆహ్వానించదు
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలను భాజపాలోకి ఎప్పటికీ ఆహ్వానించబోమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ స్పష్టం చేశారు. -
వరుణ్కు టికెట్ ఇస్తే బాగుండేది: మేనకా గాంధీ
యూపీలోని పీలీభీత్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు తన కుమారుడు వరుణ్ గాంధీకి భాజపా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన తల్లి మేనకా గాంధీ పేర్కొన్నారు. -
పోలింగ్ ముగియగానే విలేకర్ల సమావేశం నిర్వహించండి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతి విడత పోలింగ్ ముగిశాక అదే రోజు విలేకర్ల సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ తదితర మీడియా సంఘాలు డిమాండ్ చేశాయి. -
‘టెంపో’ బిలియనీర్ల తోలుబొమ్మ మోదీ
‘టెంపో బిలియనీర్ల’ చేతిలో తోలుబొమ్మలాంటి 21వ శతాబ్దపు రాజు ప్రధాని నరేంద్రమోదీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు
-
మదర్స్ డే వేళ మోదీకి స్పెషల్ గిఫ్ట్.. థాంక్స్ చెప్పిన ప్రధాని
-
దిల్లీలో ఆసుపత్రులకు బాంబు బెదిరింపుల కలకలం..