pawan kalyan: జీతం తీసుకుంటా.. ప్రతి రూపాయికీ బాధ్యతగా పనిచేస్తా
‘ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. వచ్చిన ప్రతి ఓటూ మనకు బాధ్యతను గుర్తు చేసేదే.
ఐదుకోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి
పార్టీ కార్యాలయం ప్రజల కోసం తెరిచే ఉంటుంది
ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన నేతలతో పవన్కల్యాణ్
విజేతలతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్. పక్కన నాదెండ్ల మనోహర్
ఈనాడు, అమరావతి: ‘ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. వచ్చిన ప్రతి ఓటూ మనకు బాధ్యతను గుర్తు చేసేదే. మనం ఐదు కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి’ అని జనసేన అధినేత పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ విజేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘ప్రజలు తమ కష్టం నుంచి పన్నుల రూపంలో కట్టే సొమ్మును.. ఓ ప్రజాప్రతినిధిగా జీతం రూపంలో బాధ్యతగా తీసుకుంటాను. రూపాయి మాత్రమే జీతం తీసుకుంటాననే ఆర్భాటపు మాటలు మాట్లాడను. ఖజానా నుంచి సంపూర్ణంగా జీతం తీసుకుంటాను. అలా తీసుకుంటేనే ప్రజలకు నా పై అజమాయిషీ ఉంటుంది. ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటున్నాననే బాధ్యత నాకూ ఉంటుంది. జీతం తీసుకుంటా..వారి కోసం సంపూర్ణంగా కష్టపడతా. ఎంత జీతం తీసుకుంటే దానికి వెయ్యి రెట్లు.. కష్టాల్లో ఉన్న ప్రజలకే ఇస్తాను. ప్రజలకు వారి అన్ని కష్టాల్లోనూ అండగా నిలుస్తా’ అని పవన్ అన్నారు. సినిమాలకు సెన్సార్ ఉంటుంది కానీ టీవీలకు ఉండదని, ఏం మాట్లాడినా ప్రజలు టీవీల్లో చూస్తారని, బాధ్యతాయుతంగా అందరూ వ్యవహరించాలని హితవు పలికారు. ‘భావితరాల వారు స్ఫూర్తిగా తీసుకునేలా జనసేన ప్రయాణం ఉంటుంది. యువత రాజకీయాలను కెరీర్గా చేసుకోవాలనే స్ఫూర్తి నింపేలా జనసేన ముందుకు నడుస్తుంది’ అని అన్నారు. జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన ఎలా ఉంటుందో ప్రజలకు చూపిద్దాం. గెలుపు తీసుకువచ్చిన అతిశయం ఉండకూడదు’ అని అన్నారు.
జనసేన తరఫున పోటీ చేసి ఎన్నికల్లో గెలిచిన వారితో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్
ఎంపీలు పార్లమెంటులో సమస్యలు లేవనెత్తాలి
‘ఇప్పుడు కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్ కీలకం. రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తాలి. దేశమంతా జనసేన వాణి వినిపించేలా ఎంపీలు పని చేయాలి. గెలిచిన ఇద్దరూ 5 కోట్ల ప్రజల తరఫున నిలబడాలి. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అవినీతిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను బయటకు తీసుకువచ్చి నవ పునాదులు బలంగా నిర్మించాలి. జనసేన పార్టీ కార్యాలయాన్ని 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుదాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు జనసేన కార్యాలయం తలుపులు ఎల్ల వేళలా తెరిచే ఉంటాయి’ అని హామీ ఇచ్చారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల కోసం జనసేన ఏ విధంగా నిలబడుతుందో ఆచరణలో చూపుదామన్నారు. వందశాతం స్ట్రైక్ రేట్ అన్న పవన్ మాటల గొప్పదనం ఏమిటో ఇప్పుడు అర్థమవుతోందన్నారు. ప్రతి సీటూ గెలవాలనే తలంపుతో ఆయన తీసుకున్న నిర్ణయం గర్వించదగ్గ అంశమని అభిప్రాయపడ్డారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ ఒక పార్టీ వంద శాతం విజయం అన్న మాట ఎక్కడా వినలేదన్నారు. ఈ గెలుపు వెనుక పార్టీ అధ్యక్షుడి 17 ఏళ్ల శ్రమ దాగి ఉందన్నారు. పిఠాపురంలో పని చేసిన 45 రోజులూ ఎంతో నేర్చుకున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి