Pawan Kalyan: గోదావరి జిల్లాల్లో ఒక్క సీటూ వైకాపాకు రానివ్వను: పవన్‌

మార్పుకోసమే జనసేన వచ్చిందని, ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నానని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Updated : 26 Jun 2023 15:55 IST

నర్సాపురం: గోదావరి జిల్లాల అభివృద్ధితోపాటు కాలుష్య నివారణకు మాస్టర్‌ ప్లాన్ తీసుకొస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పశ్చిమగోదావరి (WestGodavari) జిల్లా నర్సాపురంలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కొద్దిమంది చేతుల్లోనే విద్య, వైద్యం ఉండకూడదన్న పవన్‌.. అధికారంలోకి రాగానే అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

జనసేన మార్పుకోసం వచ్చిందని..  ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే పరిస్థితి లేదని పవన్‌ స్పష్టం చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైకాపాకి రాకుండా చూసే బాధ్యతను తాను తీసుకుంటానని పునరుద్ఘాటించారు. ‘‘ మార్పుకోసం వచ్చిన మనం మధ్యలో వెనకడుగు వేయకూడదు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నా. విద్య, వైద్య వ్యవస్థలు కొంతమంది చేతుల్లో ఉంటే ఎలా? గోదావరి జిల్లాల కోసం మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నాం.’’ అని  పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని