SampathReddy: గుండెపోటుతో భారాస జనగామ అధ్యక్షుడి కన్నుమూత

 జనగామ జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు.

Updated : 04 Dec 2023 22:08 IST

జనగామ పట్టణం: జనగామ జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలో నివాసం ఉంటున్న ఆయనకు సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ని హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సంపత్‌రెడ్డి ప్రస్తుతం జనగామ జిల్లా భారాస అధ్యక్షుడిగా ఉన్నారు. సంపత్‌రెడ్డి ఆకస్మిక మృతి పట్ల భారాస అధినేత కేసీఆర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, హరీశ్‌రావు, పలువురు భారాస నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యమం నుంచి తన వెంట నడిచిన సంపత్‌ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి భారాస అండగా ఉంటుందని కేసీఆర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు