Kadiyam Sri Hari: భారాస నేతలు అయోమయంలో ఉన్నారు: కడియం శ్రీహరి

భారాస నేతలు అయోమయంలో ఉన్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

Published : 30 Mar 2024 15:25 IST

హైదరాబాద్‌: భారాస నేతలు అయోమయంలో ఉన్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు కుమార్తె కావ్యతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించారని, రెండ్రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్టు తెలిపారు.

కడియం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ఆయన అనుచరులు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా భారాస బలహీనపడిందన్న కడియం.. పార్టీ నేతల నుంచి సహకారం లభించలేదని తెలిపారు. ఓడిపోయే పార్టీ నుంచి పోటీ వద్దని కావ్య అనుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయమని పిలుపు వచ్చిందని, అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. ఆరూరి రమేష్‌ వద్దంటేనే కావ్యకు టికెట్‌ ఇచ్చారని చెప్పారు.  తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదన్న ఆయన.. కావ్యను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని