Kadiyam Srihari: లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్‌లో చేరా: కడియం శ్రీహరి

భాజపా మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు.

Updated : 01 Apr 2024 14:10 IST

హనుమకొండ: భాజపా మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు. తన కుమార్తె కావ్యతో కలిసి హనుమకొండలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజును ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అధికార పార్టీలో చేరినట్లు కడియం తెలిపారు. కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మరోసారి మోసం చేసేందుకే భారాస అధినేత కేసీఆర్ వస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ఆయనకు ఏటీఎంలా మారిందన్నారు. భారాస ప్రభుత్వ హయాంలో రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చిన కరవుకు గత ప్రభుత్వమే కారణమన్నారు. ఆ పార్టీ నేతలు ధర్నా చేస్తే ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు