Kharge: మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) శనివారం ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ (EC) చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘‘మేం ఇప్పటివరకు బుల్డోజర్లు వాడలేదు.. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న ప్రధానిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం రాజ్యాంగం ప్రకారం అన్నింటికీ రక్షణ కల్పిస్తాం. రాజ్యాంగాన్ని అనుసరిస్తాం” అని ఖర్గే అన్నారు.
ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేలతో కలిసి ఖర్గే ముంబయిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్రలోని అసలైన పార్టీలకు కాకుండా భాజపాకు మద్దతిచ్చే వర్గాలకు పార్టీ గుర్తులను మంజూరుచేయాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఆయన విచారం వ్యక్తంచేశారు. ద్రోహం, కుట్రలతో మహారాష్ట్రలోని ‘మహాయుతి’(శివసేన-శిందే వర్గం,ఎన్సీపీ- అజిత్ పవార్) ప్రభుత్వం ఏర్పడిందని, దానికి ప్రధానమంత్రి స్వయంగా మద్దతిస్తున్నారని ఖర్గే అన్నారు. మోదీ ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అప్పటికే ఉన్న పార్టీల గుర్తులను తీసేసి భాజపాకు మద్దతిచ్చే పార్టీలకు ఆ గుర్తులు ఇవ్వాలని కోర్టు, ఈసీ నిర్ణయం తీసుకున్నాయని, అంతా మోదీ ఆదేశాల మేరకే జరుగుతుందని ఖర్గే అసహనం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని 48 స్థానాలకు గానూ 46 స్థానాల్లో కూటమి భారీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ధీమా వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని ప్రజలే స్వయంగా చెబుతున్నారని ఖర్గే తెలిపారు. ఆమ్ ఆద్మీ(ఆప్) పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు గురించి మాట్లాడుతూ రెండు పార్టీలు దిల్లీలో భాజపాకు వ్యతిరేకంగా పోరాడతాయి. పంజాబ్లో ఒక దానితో ఒకటి పోటీపడతాయి అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, నిరంకుశత్వానికి చోటు లేదని ఆయన అన్నారు. భాజపాను ఓడించేందుకు ఏం చేయాలో అది చేస్తామని ఖర్గే పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు ఘోర పరాభవం తప్పదు: కె.నారాయణ
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోవడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఉద్యోగాలమ్ముకుంటున్న ఎంపీ వంగా గీత: మాజీ ఎమ్మెల్యే వర్మ
కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో తాత్కాలిక ఉద్యోగాలను ఎంపీ వంగా గీత అమ్ముకుంటున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. -
సినిమా థియేటర్లలో లోక్సభ ఎన్నికల ఫలితాలు!
సార్వత్రిక ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. శనివారం చివరి విడత పోలింగ్ పూర్తికాగానే ఫలితాల కోసం ఉత్కంఠ కొనసాగుతుంది. -
ఎవరిదో విజయ మార్గం
దేశ తూర్పు ప్రాంతంలోని రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో చివరిదైన నాలుగో విడత పోలింగ్ శనివారం జరగనుంది. ఈ విడతలో కేంద్రపాడా, జాజ్పుర్, జగత్సింగ్పుర్ భద్రక్, బాలేశ్వర్, మయూర్ భంజ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. -
నేడే తుది విడత
రాబోయే ఐదేళ్లపాటు దేశ గమనాన్ని నిర్దేశించే సార్వత్రిక సమరంలో తుది విడతకు రంగం సిద్ధమైంది. ఏడో దశలో భాగంగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరగనుంది. -
ఎగ్జిట్పోల్స్ చర్చల్లో పాల్గొనం: కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికలపై శనివారం వెలువడబోతున్న ఎగ్జిట్పోల్స్పై టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొనరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. -
మోదీకి వివేకానందుడి ‘షికాగో’ బోధనలు తెలుసా?
కన్యాకుమారిలోని వివేకానంద స్మారకం వద్ద ధ్యానంలో ఆసీనుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికాలోని షికాగో సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు చేసిన చారిత్రక బోధనల గురించి తెలుసా? అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శుక్రవారం ప్రశ్నించారు. -
కొత్త ఎంపీల స్వాగతానికి ముమ్మర సన్నాహాలు
పద్దెనిమిదో లోక్సభకు కొత్తగా ఎన్నికయ్యే సభ్యులకు స్వాగతం పలికేందుకు పార్లమెంటు హౌస్ ఎనెక్స్ సన్నద్ధమైంది. వారందరికీ అధికారిక నివాసాలు కేటాయించేవరకూ వెస్ట్రన్ కోర్టులో వసతి కల్పించనున్నారు. -
ప్రధానిగా రాహులే నా అభిమతం: ఖర్గే
ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా రాహుల్గాంధీ ఉండాలనేదే తన అభిమతమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. -
కేటీఆర్, జగదీశ్రెడ్డిలపై కేసు
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, కేటీఆర్ పీఏ రమేశ్బాబులపై మేడిపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ఎవరూ కాపాడలేరు
ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి మాజీ సీఎం కేసీఆర్ను ఎవరూ కాపాడలేరని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఓటరు నాడిపై ఎవరేం చెబుతారో!
అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు... ఓట్ల పండగలో ఆఖరి అంకం ఫలితాల వెల్లడే అయినా...అంతకుముందే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ రేకెత్తించే ఘట్టం ఎగ్జిట్పోల్స్! -
సజ్జలపై క్రిమినల్ కేసు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు నమోదైౖంది. -
కౌంటింగ్లో తేడాలొస్తే లిఖితపూర్వక ఫిర్యాదు చేయండి
బ్యాలట్ యూనిట్కు సంబంధించిన ముఖ్యమైన సీళ్లు తారుమారైనట్టు గుర్తిస్తే.. ఆ ఈవీఎం లెక్కింపునకు అభ్యంతరం తెలపాలని ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లకు తెదేపా నేతలు సూచించారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్ దృష్టికి తీసుకెళ్లారు. -
పిన్నెల్లి అరాచకాలకు తోడున్న అధికారికి కౌంటింగ్ విధులా?
వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టిన ఘటన వెలుగులోకి రాకుండా విశ్వప్రయత్నాలు చేసిన పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్రెడ్డిని కౌంటింగ్ విధుల్లో నియమించడం ఏంటని తెదేపా నేతలు ప్రశ్నించారు. -
పోస్టల్ బ్యాలట్ అంటే వైకాపాకు ఎందుకు భయం?
పోస్టల్ బ్యాలట్ అనగానే వైకాపా నాయకులు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు నిలదీశారు. -
జుట్టు పట్టి ఈడ్చి.. గుండెలపై తన్ని!
‘నీవు నీ కుటుంబ సభ్యులను మార్చేశావు. అందరితో సైకిల్ గుర్తుకు ఓటు వేయించావు. ఇప్పుడు ఒంటరిగా దొరికావు. -
చెవిరెడ్డి బెదిరింపులకు తలొగ్గలేదనే ఆర్వో బదిలీ
ఒంగోలు లోక్సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు తలొగ్గనందుకే యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బాధ్యతల నుంచి తప్పించారని ఆ నియోజకవర్గ తెదేపా పరిశీలకుడు వేములకొండ శ్రీనివాస్ విమర్శించారు. -
‘విష గురువు..’ ముజ్రా గ్యాంగ్
తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపుచెక్కతో నేనొకటిస్తా అన్నట్టు లోక్సభ ఎన్నికల ప్రచారంలో నేతల మాటల దాడి కొనసాగింది. ఏడు విడతల ఎన్నికల ప్రక్రియలో ప్రచారపర్వం గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే. -
హరియాణా, యూపీల నుంచి దిల్లీకి నీటిని విడుదల చేయించండి
తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశ రాజధాని దిల్లీకి హరియాణా, ఉత్తర్ప్రదేశ్ల్లోని తమ ప్రభుత్వాలను అడిగి నెల రోజుల పాటు నీటిని విడుదల చేయించాలంటూ భాజపాకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.