Skill development case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ విచారణకు కిలారు రాజేష్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ విచారణకు కిలారు రాజేష్ హాజరయ్యారు.
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ విచారణకు కిలారు రాజేష్ హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ 41ఏ నోటీసులు ఇచ్చారు.
స్కిల్ కేసులో తనను అరెస్టు చేస్తారనే ఆందోళనతో ముందస్తు బెయిలు కోరుతూ ఆయన ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిధుల మళ్లింపులో తన ప్రమేయం ఉన్నట్లు సీఐడీ ఏడీజీ మీడియా వద్ద వెల్లడించారని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కిలారు రాజేష్ను నిందితుడిగా చేర్చలేదని, ఒకవేళ చేరిస్తే సీఆర్పీసీ సెక్షన్ 41ఎ ప్రకారం నోటీసు ఇచ్చి విచారిస్తామని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. దీంతో ఈ పిటిషన్పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ విచారణను హైకోర్టు మూసివేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.