Kishan Reddy: అందలమెక్కించిన అంకితభావం
ఠోర శ్రమ, అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనేందుకు నిలువెత్తు నిదర్శనం గంగాపురం కిషన్రెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు ఎంపీగా గెలిచి.. అందరివాడిగా పేరుతెచ్చుకున్న కిషన్రెడ్డిని మరోసారి కేంద్రమంత్రి పదవి వరించింది.
కిషన్రెడ్డిని రెండోసారి వరించిన కేంద్రమంత్రి పదవి
ఈనాడు, హైదరాబాద్: కఠోర శ్రమ, అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనేందుకు నిలువెత్తు నిదర్శనం గంగాపురం కిషన్రెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు ఎంపీగా గెలిచి.. అందరివాడిగా పేరుతెచ్చుకున్న కిషన్రెడ్డిని మరోసారి కేంద్రమంత్రి పదవి వరించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్కు చెందిన ఆయన మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. అవినీతి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి నది వరకూ ‘తెలంగాణ పోరుయాత్ర’ నిర్వహించి 333 సమావేశాల్లో ప్రసంగించారు.
రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలు
1977లో జనతాపార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కిషన్రెడ్డి 1982లో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా నియమితులయ్యారు. 1986 నుంచి ఐదేళ్లపాటు బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1990 నుంచి 2004 వరకు బీజేవైఎం రాష్ట్ర, జాతీయ కార్యవర్గాల్లో పలు హోదాల్లో పనిచేశారు. 2010 నుంచి 2016 వరకు ఉమ్మడి, తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004లో తొలిసారి హిమాయత్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014లలో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2016 నుంచి 2018 వరకు భాజపా తెలంగాణ శాసనసభాపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారు. 2019 మే నుంచి 2021 జులై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా 2021 జులై నుంచి కేంద్ర సాంస్కృతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2023 జులైలో మరోసారి భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు.. నేషనల్ యూత్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్ల విషయంలో తీసుకున్న ప్రత్యేక చొరవకు గాను యునిసెఫ్ ‘ఛైల్డ్ ఫ్రెండ్లీ లెజిస్లేటర్’ గౌరవాన్ని పొందారు.
తెలుగురాష్ట్రాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాం: జి.కిషన్రెడ్డి
ఈనాడు, దిల్లీ: రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో గల్లీలో పనిచేసిన ముగ్గురు కార్యకర్తలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత భాజపాకు మాత్రమే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. మోదీ రెండో ప్రభుత్వంలో పనిచేసిన ఆయన ఇప్పుడు మూడో ప్రభుత్వంలోనూ క్యాబినెట్ మంత్రిగా ఆదివారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘భాజపాలో పనిచేసిన వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరికి మంత్రిపదవులు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. కష్టపడి పనిచేసిన సాధారణ కార్యకర్తలకు పార్టీ మంత్రి పదవులు కట్టబెట్టింది. గల్లీలో పనిచేసిన కార్యకర్తలను దిల్లీలో మంత్రులుగా చేసిన చరిత్ర భాజపాకు తప్ప దేశంలో మరే రాజకీయపార్టీకి లేదు. మాకెవ్వరికీ రాజకీయ వారసత్వం లేదు. పెద్దనాయకులెవ్వరితోనూ బంధుత్వంలేదు. అయినా సిద్ధాంతమే మాకు ఊపిరి. పార్టీ కార్యకర్తలే కుటుంబం అని మమ్మల్ని ఎంపిక చేశారు. గత పదేళ్లు ఎలా పనిచేశామో వచ్చే 5 ఏళ్లు అలాగే పనిచేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ.తప్పకుండా అమలుచేస్తాం. తెలుగురాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాం. పార్టీ కార్యకర్తలు మరింత పట్టుదలతో భాజపాను దక్షిణాదిలో విస్తరించేందుకు ముందుండాలని పిలుపునిస్తున్నా. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలంగాణలో భాజాపాకు 8 లోక్సభ స్థానాలు, 35% ఓట్లు ఎన్నడూ రాలేదు. తెలంగాణ ప్రజలు మోదీపైన, పార్టీపైనా విశ్వాసంతో ఆశీర్వదించారు. గత శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాలు, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిపించారు. ఇకముందు శాసనసభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 88 స్థానాల్లో గెలవాలనేదే లక్ష్యం. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భాజపాను అధికారంలోకి తేవడానికి అందరూ పనిచేయాలి. నాకు ఇంతటి విజయాన్ని చేకూర్చిపెట్టిన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఓటర్లు, కార్యకర్తలకు ధన్యవాదాలు’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
పేరు: గంగాపురం కిషన్రెడ్డి
పుట్టిన తేదీ: 15-6-1960
తల్లిదండ్రులు: స్వామిరెడ్డి, ఆండాళ్లమ్మ
భార్య: కావ్యారెడ్డి (గృహిణి)
పిల్లలు: వైష్ణవి, తన్మయ్ (ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!