Kishan Reddy: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తి భాజపాయే
తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భాజపా ఎదిగిందనేందుకు లోక్సభ ఫలితాలే నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పేర్కొన్నారు.
భారాసను వద్దనుకునే ప్రజలు కమల దళాన్ని బలపర్చారు
సికింద్రాబాద్లో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసింది
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి
ఏపీ ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని వెల్లడి
ఓయూలోని కౌంటింగ్ కేంద్రం ఆవరణలో కుమార్తె వైష్ణవి, కుమారుడు తన్మయ్లతో
కలిసి గెలుపు ధ్రువీకరణపత్రాన్ని చూపుతున్న కిషన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్, బర్కత్పుర, సికింద్రాబాద్, న్యూస్టుడే: తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భాజపా ఎదిగిందనేందుకు లోక్సభ ఫలితాలే నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే.. తెలంగాణలో భారాసను వద్దనుకుంటున్న ప్రజలు మోదీ నాయకత్వంలో భాజపా బలపడాలని కోరుకున్నట్టు స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రంలో పార్టీకి 2019 లోక్సభ ఎన్నికల కంటే ఓట్లు పెరిగాయని, ఖమ్మం లాంటి నియోజకవర్గంలోనూ లక్షకు పైగా ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పార్టీ ప్రధాన పోటీగా నిలిచి భాజపాను ఓడించాలని ప్రయత్నించి విఫలమైందని ఆక్షేపించారు. తెలంగాణ భాజపా పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి అభయ్పటేల్తో కలిసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రజలు తొలిసారిగా భాజపాకు సొంతంగా అత్యధిక స్థానాలను కట్టబెట్టారు. మోదీ నాయకత్వంపై విశ్వాసంతోనే అది సాధ్యమైంది. మేం గెలుపొందని స్థానాల్లోనూ ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నాం. హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలను మభ్యపెట్టేవే తప్ప, ఆచరణ సాధ్యమైనవి కావని ప్రజలు గుర్తించారు.
తప్పుడు ప్రచారాన్ని నమ్మలేదు
కాంగ్రెస్ పార్టీ ఫేక్వీడియోలు తయారుచేయడంతోపాటు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్, భారాసలు తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించలేదు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో ప్రజలు ఆ పార్టీని నమ్మలేదు. పైగా దేవుళ్ల మీద ఒట్లు వేసి కాలం గడుపుతున్నట్లు అర్థం చేసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ఆర్నెల్ల పాలన చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు నిరాశకు గురయ్యారు. అందుకే వారికి భాజపా ప్రత్యామ్నాయంగా కనిపించింది. కాంగ్రెస్కు 50 శాతం సీట్లు కూడా రాలేదు. ఈ ఫలితాలను ఏరకంగా రెఫరండంగా తీసుకుంటారో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పాలి.
భారాస తుడిచిపెట్టుకుపోయింది
ఆర్నెల్ల క్రితం వరకు రాష్ట్రాన్ని పాలించిన భారాస ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భారాస కంచుకోట మెదక్ను బద్దలుకొట్టి జెండా ఎగరేశాం. తెలంగాణ ప్రజలు పార్టీకి ఎనిమిది సీట్లు ఇచ్చినందున...రానున్న రోజుల్లో మరింత అంకితభావంతో పనిచేస్తాం. భవిష్యత్తులో మరింత బలాన్ని పెంచుకునే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాం’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ నాయకత్వంలో అధికారంలోకి వచ్చామన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్ నాయకత్వంలో ఏపీ ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ఉత్తర్ప్రదేశ్లో భాజపాకు సీట్లు తగ్గడంపై జాతీయ పార్టీలో విశ్లేషించుకుంటామన్నారు. అంతకుమునుపు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించి, ఆర్వో నుంచి ధ్రువీకరణ పత్రం స్వీకరించిన తర్వాత కిషన్రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రానున్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానన్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలపక్షాన పోరాడతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్