Nellore: చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్ ట్యాపింగ్పై విచారణ: కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
రూ.కోట్లు ఖర్చుపెట్టి ఇతర పార్టీల నేతలపై సోషల్ మీడియా ద్వారా వైకాపా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు.
నెల్లూరు: రూ.కోట్లు ఖర్చుపెట్టి ఇతర పార్టీల నేతలపై సోషల్ మీడియా ద్వారా వైకాపా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీతపై సోషల్మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఓటమి భయంతో మాట్లాడుతున్నారని చెప్పారు. తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని విమర్శిస్తే ఇకముందు తామే సమాధానం చెబుతామన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి లోక్సభ స్థానానికి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్ ట్యాపింగ్పై విచారణ తప్పదని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని తాను ఏడాది క్రితమే బయటపెట్టినట్లు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వివరించారు.
ప్రసన్నకుమార్రెడ్డి సభ్యత మరచి మాట్లాడుతున్నారని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ విమర్శించారు. ఓటమి భయంతోనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. విజయసాయి రెడ్డి ఓటు నేటికీ విశాఖ సీతమ్మధారలో ఉందని.. అక్కడి నుంచి జగన్, విజయసాయిరెడ్డిని తరిమేశారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్