KTR: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర: కేటీఆర్
ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: భారాస నేతలు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. కేసీఆర్ మినహా మిగతా ముఖ్య నేతలంతా తరలివెళ్లారు. తొలుత మేడిగడ్డను సందర్శించిన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు ఆయన మాట్లాడారు. ‘తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలి’ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైందని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా కేసీఆర్ నిర్మించారని కొనియాడారు. రాష్ట్రంలో కరవు లేకుండా చేసేందుకే కాళేశ్వరం నిర్మించారని తెలిపారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జరిగినట్లు.. లేనిది ఉన్నట్టు చూపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి. మేడిగడ్డ ఆనకట్టలోని 84 పిల్లర్లలో 3 మాత్రమే కుంగాయి. లోపాలను సవరించాలి కానీ.. రాజకీయం చేయొద్దు. రాజకీయం చేసేందుకు మేడిగడ్డను వాడుకుంటున్నారు’ అని పోచారం విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు