KTR: పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్: కేటీఆర్
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్: పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదన్నారు. అన్నదాతల్లో బాధ మొదలైందని, యువత ఆవేదనతో ఉన్నారని చెప్పారు. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందో తెలియక హైదరాబాద్ ప్రజలు ఆలోచనలో పడ్డారని ఎద్దేవా చేశారు.
‘‘డిసెంబర్ 9న విడుదల చేస్తామని చెప్పిన రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడం లేదు. కల్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం లేదు. కాంగ్రెస్పై ఆటోడ్రైవర్లు కోపంగా ఉన్నారు. కేసీఆర్ను నోటికొచ్చినట్లు దూషిస్తుంటే బాధగా అనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో భారాస గెలుపే.. అరిచేవారికి సమాధానం కావాలి. మల్కాజిగిరిలో తేల్చుకుందామని రేవంత్కు సవాల్ విసురుతున్నా. ఇద్దరం ఇక్కడి నుంచి పోటీ చేద్దాం.. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. పెద్దపెద్ద డైలాగ్లే తప్పా.. రేవంత్కు ధైర్యం లేదు. భాజపాలోకి పోవాలన్నది ఆయన ఆలోచన. కొంత మంది కాంగ్రెస్, భారాస ఎమ్మెల్యేలతో భాజపాలోకి పోతారు.’’ అని కేటీఆర్ అన్నారు.
అంతకుముందు చేవెళ్ల లోక్సభ పరిధిలోని భారాస ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ‘‘అధికారం, ఆస్తుల కోసమే రంజిత్రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్కు వెళ్లారు. హస్తం పార్టీకి ఈ లోక్సభ నియోజకవర్గంలో కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్రమైన అయోమయంలో ఉంది. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యం. చేవెళ్లలో ఏప్రిల్ 13న జరిగే సభలో కేసీఆర్ పాల్గొంటారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా నిలబడిన వ్యక్తి’’ అని కేటీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్