BJP: రాశి.. వాసితో కమల వికాసం
రాష్ట్రంలో ఎన్నిక ఎన్నికకు బలాన్ని పెంచుకుంటూ భాజపా బలమైన శక్తిగా ముందుకు వెళ్తోంది. తాజా లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటుకుంది.
లోక్సభ ఎన్నికల్లో 35.08 శాతం ఓట్లతో 8 చోట్ల విజయం... 7 స్థానాల్లో రెండో స్థానం
పదేళ్లలో బలమైన స్థితికి భాజపా
ఎన్నిక... ఎన్నికకు బలోపేతమవుతున్న పార్టీ
ఈనాడు, హైదరాబాద్
కరీంనగర్లో విజయం సాధించిన అనంతరం భాజపా నిర్వహించిన ర్యాలీలో అభ్యర్థి బండి సంజయ్ను ఎత్తుకుని ఊరేగిస్తున్న కార్యకర్తలు
రాష్ట్రంలో ఎన్నిక ఎన్నికకు బలాన్ని పెంచుకుంటూ భాజపా బలమైన శక్తిగా ముందుకు వెళ్తోంది. తాజా లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటుకుంది. పదేళ్లలో పార్టీ రాష్ట్రంలో ఓట్లను... సీట్లను గణనీయంగా పెంచుకుంటోంది. ఈ ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు పోటీ పడి ఎనిమిది చోట్ల నెగ్గి.. మరో ఏడు స్థానాలలో రెండో స్థానంలో నిలిచింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలలో మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది.
విజయం సాధించిన స్థానాలు: ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్నగర్, మెదక్
రెండో స్థానంలో నిలిచినవి : పెద్దపల్లి, జహీరాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్కర్నూల్, హైదరాబాద్.
కాంగ్రెస్తో సమానంగా సీట్లు
రాష్ట్రంలో కాంగ్రెస్తో సమానంగా భాజపా లోక్సభ సీట్లను గెలుచుకోగా భారాస అత్యధిక స్థానాల్లో మూడో స్థానానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తక్కువ ఓట్లను పొందుతున్నా లోక్సభ ఎన్నికలో మాత్రం అనూహ్య ఫలితాలను సొంతం చేసుకుంటూ వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 19.45 శాతం ఓట్లతో సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో గెలిచిన భాజపా ఈ సారి ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని ఏకంగా 35.08 శాతానికి, సీట్ల సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది. కాంగ్రెస్కు 40.1 శాతం, భారాసకు 16.68 శాతం ఓట్లు వచ్చాయి. గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 13.9 శాతం ఓట్లతో ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.
ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో గెలవకున్నా...
2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా భాజపా గెలవకున్నా తాజా ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. కరీంనగర్, సికింద్రాబాద్ మహబూబ్నగర్, మెదక్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ స్థానాల్లోని 42 అసెంబ్లీ స్థానాల్లో ఒక చోట కూడా విజయం సాధించకున్నా తాజా ఎన్నికల్లో ఈ ఆరు లోక్సభ స్థానాలను భాజపా సొంతం చేసుకుంది. ప్రతి లోక్సభ స్థానంలో పార్టీ ఓట్లను గణనీయంగా పెంచుకుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో ఆయా లోక్సభ స్థానాల పరిధిలోని సెగ్మెంట్లలో వచ్చిన ఓట్లకు తాజాగా వచ్చిన వాటికి మధ్య భారీ పెరుగుదల ఉంది.
ఫలించిన ‘మరోసారి మోదీ’ నినాదం
పకడ్బందీ కార్యాచరణ... పక్కా ప్రణాళిక... ముందస్తు వ్యూహం... అభ్యర్థుల ఎంపిక... జాతీయ నేతల విస్తృత ప్రచారం... ‘మరోసారి మోదీ’ నినాదం.. క్షేత్రస్థాయిలో అమలు చేసిన సూక్ష్మ ప్రణాళిక లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సత్తా చాటేందుకు భాజపాకు ఉపకరించాయి. ఎనిమిది లోక్సభ స్థానాలను దక్కించుకునేందుకు బాటలు వేశాయి. పార్టీ జాతీయ నాయకత్వం పకడ్బందీ ప్రణాళికను రాష్ట్ర పార్టీకి నిర్దేశించడం.. రాష్ట్ర నాయకత్వం దానిని బలంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం కలిసొచ్చింది. రెండంకెల స్థానాలు లక్ష్యంగా బరిలో దిగిన పార్టీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. భాజపా, అనుబంధ విభాగాలు చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చినట్లు పార్టీ విశ్లేషిస్తోంది.
బలమైన అభ్యర్థులను బరిలో దింపడమే లక్ష్యంగా...
భాజపాలోని బలమైన నేతలతో పాటు కొత్త నేతలకు పార్టీ టికెట్లలో ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీలో కీలక నేతలు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, డి.కె.అరుణ, ఈటల రాజేందర్, డి.అర్వింద్, రఘునందన్రావులను అభ్యర్థులుగా బరిలో దింపింది. మరోసారి మోదీ ప్రధానమంత్రి కావాలనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దాన్ని ఎన్నికల నినాదంగా మార్చింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేసింది. ఎప్పటికప్పుడు సర్వేలు, అంచనాలతో అంతర్గత పరిస్థితులను గుర్తించి దానికి అనుగుణంగా ప్రణాళిక అమలు చేసింది. బహుముఖ కార్యాచరణ పార్టీకి ఉపకరించినట్లు భాజపా నేతలు విశ్లేషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన