Lokesh: మూడు నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతోంది: లోకేశ్‌

మూడు నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. 

Updated : 10 Dec 2023 14:52 IST

తుని: గత ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను వైకాపా ప్రభుత్వం తరిమేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ (Nara Lokesh) విమర్శించారు. మూడు నెలల్లో అధికారంలోకి వస్తామని, మళ్లీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ సెజ్‌ బాధిత రైతులతో నారా లోకేశ్‌ ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సి ఉందన్నారు.

‘‘ తక్కువ కాలుష్యంతో పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత తెదేపా తీసుకుంటుంది. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. స్థానికులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాం. తెదేపా హయాంలో తీసుకొచ్చిన కియా పరిశ్రమ వల్ల వేలాది మంది జీవితాల్లో మార్పు వచ్చింది. పరిశ్రమలు వస్తే గ్రామాల రూపురేఖలు మారిపోతాయి. ఆక్వా రంగంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. వైకాపా ప్రభుత్వం హయాంలో ఆక్వా ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ల పరిశ్రమ తీసుకొచ్చా. ఆ పరిశ్రమలో 6వేల మంది పని చేసేవారు’’ అని లోకేశ్‌ గుర్తు చేశారు. న్యాయం చేయాలని ప్రశ్నించిన వారిని వైకాపా ప్రభుత్వం హింసిస్తోందన్న లోకేశ్‌.. మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని