Lok Sabha: మరో ఇద్దరు భాజపా ఎంపీల రాజీనామాలు ఆమోదం

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భాజపా ఎంపీలు తమ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆమోదించారు. 

Updated : 08 Dec 2023 15:50 IST

దిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన మరో ఇద్దరు ఎంపీల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆమోదించారు. భాజపా ఎంపీలు  బాబా బాలక్‌నాథ్‌, రేణుకా సింగ్‌ రాజీనామాలకు ఆమోదం తెలిపారు. బాలక్‌నాథ్‌ రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేయగా.. రేణుకాసింగ్‌  ఛత్తీస్‌గఢ్‌ బరిలో దిగి విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 12 మంది గెలుపొందగా.. వారిలో 11 మంది లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. 

మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు

వీరంతా తమ ఎంపీ పదవులకు ఇటీవల రాజీనామా చేయగా.. నిన్న 9మంది ఎంపీల రాజీనామాలను ఆమోదించిన లోక్‌సభ స్పీకర్‌.. శుక్రవారం మిగిలిన ఇద్దరు ఎంపీల రాజీనామాలకు ఆమోదముద్ర వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వారిలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ పటేల్‌, రాకేశ్‌ సింగ్‌, ప్రతాప్‌ సింగ్‌, రితి పాఠక్‌(మధ్యప్రదేశ్‌), దియా కుమారి, రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌, బాలక్‌నాథ్‌ (రాజస్థాన్‌), గోమతి సాయి, అరుణ్‌ సావో, రేణుకా సింగ్‌(ఛత్తీస్‌గఢ్‌)తో పాటు రాజ్యసభ ఎంపీ కిరోరి లాల్‌ మీనా (రాజస్థాన్‌) ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని