AP Assembly: తెదేపా సెంచరీ.. ఆంధ్రప్రదేశ్‌లో మేజిక్‌ ఫిగర్‌ దాటేసిన ఎన్డీయే కూటమి

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజృంభణ కొనసాగుతోంది. తెదేపా-జనసేన-భాజపా కూటమి మేజిక్‌ ఫిగర్‌ను దాటేసింది.

Published : 04 Jun 2024 17:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజృంభణ కొనసాగుతోంది. తెదేపా-జనసేన-భాజపా కూటమి మేజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. అధికారం చేపట్టేందుకు 88 సీట్లు అవసరం కాగా.. మూడు పార్టీలు కలిసి 124 స్థానాల్లో విజయం సాధించాయి. తెదేపా ఒంటరిగానే 100 స్థానాల్లో గెలిచింది. జనసేన 19, భాజపా 7 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. తెదేపా మరో 37, జనసేన 2, భాజపా ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికార వైకాపా కేవలం ఐదు స్థానాల్లోనే విజయం సాధించింది. మరో నాలుగింట్లో ఆధిక్యంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు