Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి?
ఇంటర్నెట్డెస్క్: మధ్యప్రదేశ్లో ఎన్నికల (Madhya Pradesh Elections) వేడి రాజుకుంది. అధికార భాజపా (BJP) జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దింపగా... ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) కూడా పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తూ.. రూ.25 లక్షల ఆరోగ్య బీమా (Health Insurance), రూ.500కే గ్యాస్ సిలిండర్ సహా 59 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది. అన్ని వర్గాలను ఆకర్షించేలా మేనిఫెస్టో రూపొందించింది. 2020లో తమ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపాపై ప్రతీకారం తీర్చుకోవాలని హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతుండగా.. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలదళం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ద్విముఖ పోరులో ఆయా పార్టీలు ఎదుర్కోబోతున్న ప్రధాన సవాళ్లేంటి?
1. ప్రభుత్వ వ్యతిరేకత
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన భాజపా నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని ముందే గుర్తించిన భాజపా అధిష్ఠానం జాతీయ స్థాయి నాయకులు ఏడుగుర్ని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టింది. వారిలో ముగ్గురు కేంద్ర మంత్రులు, నలుగురు ఎంపీలు, ఒక జనరల్ సెక్రెటరీ ఉన్నారు. మరోవైపు తాజా ఎన్నికల్లో శివరాజ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధిష్ఠానం కూడా శివరాజ్పై సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఆ ఏడుగురిలో ఎవరికైనా పగ్గాలు అప్పగించాలని భాజపా అధిష్ఠానం భావిస్తోంది.
2. హిందుత్వం
భాజపా చేపడుతున్న జన ఆశీర్వాద యాత్రల్లో హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తోంది. సనాతన ధర్మంపై విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు చేసిన వ్యాఖ్యల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి హిందూ ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలని చూస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఉజ్జయినిలోని మహాకాళ్ లోక్ కారిడార్, ఓంకారేశ్వర్లో ఆదిశంకరాచార్యుల విగ్రహం ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ..వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ కూడా తాము హిందుత్వ వ్యతిరేకం కాదని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్నాథ్ తాను హనుమాన్ భక్తుడినని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం, తన స్వస్థలం చింద్వాడాలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన, భజరంగ్ సేనను కాంగ్రెస్లోకి ఆహ్వానించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.
రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. రూ.500కే గ్యాస్ సిలిండర్!
3. ఓబీసీలు ఎవరి వైపో..!
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని హమీ ఇచ్చిన కాంగ్రెస్.. ఓబీసీలు తమకు వెన్నుదన్నుగా నిలుస్తారని భావిస్తోంది. మధ్యప్రదేశ్ మొత్తం జనాభాలో వీరి వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుంది. గతంలో వీరంతా భాజపాకు అనుకూలంగా ఉండేవారు. శివరాజ్ సింగ్ చౌహాన్కు ముందు.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పని చేసిన ఉమాభారతి, బాబూలాల్ గౌర్లు ఓబీసీ నేతలే. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓబీసీకి చెందిన వ్యక్తే కావడం భాజపాకి రాష్ట్రంలో బాగా కలిసొచ్చింది. తాజాగా కాంగ్రెస్ కులగణన చేపడతామని హామీ ఇవ్వడంతోపాటు మహిళా రిజర్వేషన్లోనూ ఓబీసీ కోటాను తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో ఓబీసీలు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.
4. మహిళలే సగం
ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లో మొత్తం ఓటర్లు 5.52 కోట్లు కాగా.. అందులో 2.67 కోట్ల మంది మహిళలు. అంటే దాదాపుగా పురుష ఓటర్లతో సమానంగా ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం మహిళలకే కేటాయిస్తామని భాజపా చెబుతుండగా.. కాంగ్రెస్ కూడా మహిళా అనుకూల పథకాలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా భాజపా హయాంలో మహిళలపై జరిగిన వేధింపులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, తద్వారా భాజపాపై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల ఉజ్జయిని ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని, ఆమె సాయం కోసం ఇంటింటికీ తిరిగిన వైనాన్ని ఇందుకు అస్త్రంగా ఉపయోగించుకుంటోంది.
5. ఆదివాసీలు
2018 ఎన్నికల్లో భాజపాపై ఆదివాసీ ఓట్లు తీవ్ర ప్రభావం చూపించాయి. మధ్యప్రదేశ్లోని ఓటర్లలో దాదాపు 21శాతం మంది ఆదివాసీలు. మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 47 స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 2018 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో భాజపా కేవలం 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా.. కాంగ్రెస్ 31 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో వారి ఆకర్షించేందుకు భాజపా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 5న ప్రధాని మోదీ.. ఆదివాసీల ఆరాధ్యురాలు రాణి దుర్గావతి 500 జయంతి ఉత్సవాలను నిర్వహించారు. మరోవైపు భాజపా ప్రభుత్వ హయాంలో ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలను కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది.
6. ఎస్సీలు
మధ్యప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 17శాతం మంది ఎస్సీలు. వారికి 35 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. బుందేల్ఖండ్, గ్వాలియర్ -చంబల్, వింధ్య ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఎస్సీ ఓట్లు చాలా కీలకం. 2018 ఎన్నికల్లో ఆయా స్థానాల్లో కాంగ్రెస్ 17 నియోజకవర్గాల్లోనూ, భాజపా 18 నియోజక వర్గాల్లో విజయం సాధించింది. 2013 ఎన్నికల్లో భాజపా 28 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ మాత్రం 4 స్థానాలకు పరిమితమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎస్సీ ఓటర్లను ఆకర్షించేందుకు భాజపా ఎస్సీ ప్రముఖలకు సంబంధించిన వేడుకలను నిర్వహిస్తోంది. అదేసమయంలో ఎస్సీలపై జరిగిన దౌర్జన్యాలను కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది.
7. అవినీతి
కర్ణాటక తరహాలోనే మధ్యప్రదేశ్లోనూ భాజపా అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా కమల్నాథ్తో సహా పార్టీ నేతలంతా చౌహాన్ ప్రభుత్వాన్ని ‘ 50శాతం కమిషన్’ ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారు. భాజపా హయాంలో అవినీతికి అంతులేకుండా పోయిందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ల భాజపా పాలనలో 250 కుంభకోణాలు చోటు చేసుకున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ విమర్శలను భాజపా తనదైన శైలిలో తిప్పికొడుతోంది. కాంగ్రెస్ నేతలు చేసిన కుంభకోణాలు రూ.20 లక్షలకోట్లకు పైగానే ఉంటాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ జూన్ నెలలో భోపాల్లో నిర్వహించిన ఓ సమావేశంలో విమర్శించారు.
8. రైతు సమస్యలు
రాష్ట్ర జనాభాలో 70 శాతం మంది రైతులే. గిట్టుబాటు ధర, పెట్టుబడి, వాతావరణ మార్పులు, వసతుల లేమి తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వారిని తమవైపు తిప్పుకునేందుకు భాజపా, కాంగ్రెస్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రూ.2 లక్షల మేర రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి రైతులు కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ 2017లో మందసౌర్లో నిరసన చేపడుతున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్.. రైతు రుణాల మాఫీ, ఉచిత విద్యుత్, 37 లక్షల మంది రైతులకు ఉచిత నీటిపంపులు లాంటి రైతు అనుకూల విధానాలను ప్రకటించి ఓటర్లను ఆకర్షించింది.
9. నిరుద్యోగం
మధ్యప్రదేశ్లో మరో ప్రధాన సమస్య నిరుద్యోగం. గత మార్చి నెలలో ఓ సర్వే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 39,93,149 మంది యువత ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. భాజపా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,298 మంది విద్యార్థులు, 6,999 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ‘ లెర్న్ అండ్ ఎర్న్’ లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చిన భాజపా.. గత మూడేళ్లలో 61 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెబుతోంది. కానీ, కాంగ్రెస్ మాత్రం కేవలం 21 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్లు లెక్కలు చూపిస్తోంది.
ఈ తరహా సవాళ్లను ఎన్నికలకు ముందు భాజపా, కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటాయో.. ఏ పార్టీ విజయం సాధిస్తుందో తెలియాలంటే డిసెంబరు 3న ఫలితాలు వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్