Ponnam Prabhakar: తెలంగాణలో త్వరలో ‘కల్లు బార్లు’: మంత్రి పొన్నం

మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

Updated : 03 Mar 2024 20:19 IST

మహబూబ్‌నగర్‌: రాబోయే రోజుల్లో ‘కల్లు బార్లు’ ఏర్పాటు దిశగా కార్యచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ కుల వృత్తులు మారుతున్నాయని చెప్పారు. అన్ని రకాల వ్యాపారాల తీరు మారుతోందని.. వాటితో పాటు గీత కార్మికుల వృత్తినీ ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా కల్లును కల్తీ లేకుండా గౌరవప్రదంగా అమ్మే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులైందని.. ఇప్పటివరకు 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ఉండాలని.. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికలలో ఓట్లు అడిగే నైతిక అర్హత కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులకు లేదని జూపల్లి విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని