Uttam kumar reddy: ఆరోపణల్లో పైసా నిజం లేదు
భాజపా, భారాసలు కుమ్మక్కై అబద్ధాలు, అవాస్తవాలతో రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. తాను రూ.వంద కోట్లు దిల్లీకి పంపానని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నయాపైసా నిజం లేదని స్పష్టం చేశారు.
మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
విపక్ష నేతలపై మండిపడిన ఉత్తమ్
మహేశ్వర్రెడ్డి పదవిని కొనుక్కున్నారని ఆరోపణ
మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్. పక్కన శ్రీధర్బాబు
ఈనాడు, హైదరాబాద్: భాజపా, భారాసలు కుమ్మక్కై అబద్ధాలు, అవాస్తవాలతో రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. తాను రూ.వంద కోట్లు దిల్లీకి పంపానని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నయాపైసా నిజం లేదని స్పష్టం చేశారు. ఆదివారం గాంధీభవన్లో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి, మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్కుమార్, పట్లోళ్ల సంజీవరెడ్డి, పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
కిషన్రెడ్డి కన్నా వేగంగా ఎదగాలని మహేశ్వర్రెడ్డి ప్రయత్నం
‘‘నేను మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని భారాస నేత కేటీఆర్, భాజపా నేత మహేశ్వర్రెడ్డిలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోను. డబ్బు తీసుకోవడం కాదు కదా.. కనీసం మిల్లర్లను వ్యక్తిగతంగా కూడా కలవలేదు. వారి సంఘం తరఫున వస్తేనే మాట్లాడాను. మేం సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు. భాజపా, భారాస నేతలు టెండరు షరతులకు లోబడి.. సన్న బియ్యం కిలో రూ.42 చొప్పున అమ్మితే ప్రభుత్వం కొంటుంది. మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం మాదే. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం ఇవ్వకుండా ఎగవేసిన రైస్ మిల్లర్ల కోసమే భాజపా, భారాస మాట్లాడుతున్నాయి. భాజపా నేత మహేశ్వర్రెడ్డి దిల్లీలో భాజపా నేతలకు డబ్బులు పంపి రాష్ట్ర శాసనసభాపక్ష నేత పదవి కొనుక్కున్నారు. భాజపాలో కిషన్రెడ్డిని అధిగమించి పదవులు పొందాలని, ఓవర్ స్పీడ్గా పోవాలని అనుకుంటున్నారు. కొందరు నేతలు గతంలో మంత్రుల వద్దకు వెళ్లి.. భూముల విషయం మాట్లాడుకుని, బయటికొచ్చి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడినట్లు చెప్పుకొనేవారు. మాది అలాంటి సంస్కారం కాదు. సన్నరకం ధాన్యం అమ్మకాలకు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిస్తే క్వింటాకు ధర రూ.1700 వచ్చింది. మేం అధికారంలోకి వచ్చాక రూ.2400 వస్తోంది. గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు’’ అని ఉత్తమ్ అన్నారు.
పీఎం కార్యాలయ ఒత్తిడితో ఇక్కడి పరిశ్రమలు ఉత్తరాదికి: మంత్రి శ్రీధర్బాబు
లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాస కలిసిపనిచేసినా సీట్లు రావట్లేదనే అక్కసుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ప్రతిపక్షాల విమర్శలకు తమ ప్రభుత్వ పనితీరే సమాధానమని అన్నారు. ‘‘ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే పనులకు, పాలనకు అడ్డొస్తే సహించేదిలేదు. గత భారాస ప్రభుత్వం చేసిన పొరపాట్లు మేం చేయం. సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు అబద్ధాలు చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. గత సంవత్సరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 121సార్లు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఇటీవల సాంకేతిక కారణాలతో కాసేపు కరెంటు ఆగితే కోతలు విధిస్తున్నారని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో అదే ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికాయి. ప్రధానమంత్రి కార్యాలయం తెస్తున్న ఒత్తిడితో ఇక్కడి పరిశ్రమలను వాటి యాజమాన్యాలు ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నాయి. అయినా వాటిని మించిన పరిశ్రమలను మేం తీసుకువస్తాం’’ అని శ్రీధర్బాబు చెప్పారు. గత 5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదని, తాము 5 నెలల్లో చేయబోతున్నామని జీవన్రెడ్డి అన్నారు. తెలంగాణలో ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా.. అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం