Modi: రేపే మోదీ పట్టాభిషేకం
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు.
వరసగా మూడోసారి ప్రధాని పీఠంపైకి..
రాష్ట్రపతి నుంచి నియామక లేఖ
రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు తీర్మానం ప్రతిని అందజేస్తున్న జేడీయూ
అధ్యక్షుడు నీతీశ్కుమార్, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు,
భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. చిత్రంలో అనుప్రియా పటేల్,
పవన్కల్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్శిందే, రాజ్నాథ్సింగ్, అమిత్ షా, అజిత్పవార్
ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తిచేశారు. అట్టహాసంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈనెల 5న ఎన్డీయే పార్టీల నేతలు కలిసి నరేంద్రమోదీని తమ నాయకుడిగా ప్రకటించగా శుక్రవారం కూటమి ఎంపీలంతా సమావేశమై ముక్తకంఠంతో ఆమోదముద్ర వేశారు. పార్లమెంటు పాత భవనంలోని సెంట్రల్ హాల్లో సుమారు రెండున్నర గంటలపాటు ఎన్డీయే పక్షాల అధినేతలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఎంపీలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తర్వాత ఎన్డీయే నేతలు ఆ ప్రతిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఆ మేరకు ప్రధానమంత్రిని రాష్ట్రపతి ఆహ్వానించి ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపే లేఖను అందించారు. ఈ విషయాన్ని మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద మీడియాకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
18కి చాలా ప్రాధాన్యం: మోదీ
‘‘18వ లోక్సభ ఏర్పాటవుతోంది. మనిషి జీవితంలోనూ 18కి చాలా ప్రాధాన్యం ఉంది. టీనేజ్ పూర్తిచేసుకొనే వయసు ఇది. ఒకరకంగా ఇది కొత్తశక్తిని ఇస్తోంది. స్వాతంత్య్ర అమృతోత్సవం ముగిసిన వెంటనే జరిగిన తొలి ఎన్నిక ఇది. 2047కల్లా దేశం స్వాతంత్య్ర శత వసంతోత్సవాలు జరుపుకొనేనాటికి మనం కన్న కలలన్నీ నెరవేర్చుకోవడానికి పునాదివేసే లోక్సభ ఇదే. మూడోసారి దేశానికి సేవ చేయడానికి ప్రజలు అవకాశమిచ్చారు. ఇందుకు ప్రజలకు ధన్యవాదాలు. గత రెండు పర్యాయాల్లో వేగంగా దేశం వేసిన ముందడుగు, సమాజంలోని ప్రతి విభాగంలో కనిపిస్తున్న స్పష్టమైన మార్పు ప్రతి భారతీయుడికి గర్వకారణం. 18వ లోక్సభ పదవీకాలంలోనూ మేం అదే వేగంతో, అంకితభావంతో దేశ ఆకాంక్షలు పూర్తిచేయడానికి పనిచేస్తాం.
అట్టహాసంగా నాయకుడి ఎంపిక
ఎన్డీయే పక్షాల నేతగా నరేంద్ర మోదీని ఎంపిక చేసే కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కూటమి ఎంపీలు, ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమక్షంలో కరతాళ ధ్వనుల మధ్య మోదీ ఎన్నిక పూర్తయింది. ఉదయం సెంట్రల్హాల్లోకి మోదీ వచ్చిన వెంటనే భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. వేదికపై మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అగ్రనేత నీతీశ్కుమార్లు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. నడ్డా స్వాగతోపన్యాసం చేస్తూ మోదీని కూటమి నేతగా ఎన్నుకోవడాన్ని చరిత్రాత్మక క్షణంగా అభివర్ణించారు. దీనికి సాక్షులుగా నిలవడాన్ని అదృష్టంగా అభివర్ణించారు. ఎన్డీయే కూటమి నేతగా మోదీ పేరును ప్రస్తావిస్తూ రాజ్నాథ్సింగ్ తీర్మానం ప్రవేశపెట్టారు. 1962 తర్వాత ఏ నాయకుడూ మూడోసారి వరుసగా ప్రధానమంత్రి కాలేదని చెప్పారు. ఎన్డీయే ఎంపీలంతా లేచి మోదీ...మోదీ... అని నినదిస్తూ తమ సమ్మతి తెలిపారు. అమిత్షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్కల్యాణ్, నీతీశ్కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, అజిత్పవార్, చిరాగ్ పాస్వాన్, జితిన్రామ్ మాంఝీ, హెచ్డీ కుమారస్వామి, అనుప్రియా పటేల్ తదితరులు బలపరిచారు.
అనుభవం వచ్చింది.. పరుగులు తీయిస్తా
2014లో నాకు ఈ పదవి కొత్త. ఇప్పుడు అనుభవం వచ్చింది. అందువల్ల ఇప్పుడు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడం సులభంగా మారింది. ఈ పదేళ్ల కాలంలో భారత్ విశ్వబంధుగా అవతరించింది. దాని ఫలితాలు ఇప్పుడు ప్రారంభమవుతాయి. ఈ అయిదేళ్లలో ప్రపంచ పరిస్థితులు మనకు మేలు చేయబోతున్నాయి. సుస్థిర ప్రభుత్వం ఏర్పడటంవల్ల భారత్ వృద్ధి మరింత వేగం పుంజుకోనుంది. దీనివల్ల ప్రతి రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు’’ అని మోదీ చెప్పారు.
మోదీ నాయకత్వం మా అదృష్టం
నరేంద్రమోదీకి ప్రధానమంత్రిగా నియామక పత్రాన్ని అందజేస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము
కేవలం మోదీవల్లే వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీయే అధికారం చేపట్టబోతోందని కూటమి నాయకులంతా శ్లాఘించారు. ఆయన నాయకత్వంలో పనిచేయడాన్ని అదృష్టంగా అభివర్ణించారు. తీర్మానం ఆమోదం పొందిన తర్వాత చంద్రబాబు, నడ్డా సహా అన్నిపక్షాల నేతలు మోదీకి గజమాలవేసి సత్కరించారు. ఆ తర్వాత ఆయన ఎంపీలను ఉద్దేశించి గంటన్నరపాటు ప్రసంగం చేశారు. మోదీని చంద్రబాబు శాలువాతో సత్కరించడంతోపాటు తిరుమల శ్రీవారి ప్రసాదం అందించారు. పవన్కల్యాణ్తో కలిసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించి అంతా శుభం కలగాలని ఆకాంక్షించారు. సమావేశానంతరం చంద్రబాబు, నీతీశ్కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. ఎన్డీయేకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను సమర్పించారు. ప్రధాన భాగస్వామ్య పక్షాలకు కొత్త కేబినెట్లో ముందుగా కనీసం ఒక్కో బెర్తు కేటాయిస్తారని సమాచారం.
ఎన్డీయే లోక్సభాపక్ష నేతగా ఎన్నికైన నరేంద్రమోదీకి దహీ-చీనీతో నోరు తీపిచేస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు