Nara Lokesh: ప్రశ్నించిన వారిని తన్నేందుకా ‘సిద్ధం’: నారా లోకేశ్‌

వైకాపా నేతలు ‘సిద్ధం’ అంటే ఏంటో అనుకున్నానని.. ప్రశ్నించిన వారిని తన్నేందుకా? అని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఎద్దేవా చేశారు.

Published : 03 Apr 2024 12:13 IST

అమరావతి: వైకాపా నేతలు ‘సిద్ధం’ అంటే ఏంటో అనుకున్నానని.. ప్రశ్నించిన వారిని తన్నేందుకా? అని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రాజధాని ఎక్కడని ప్రశ్నించిన వారిపై ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వైకాపా సైకోలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దాడులు జరగడం దారుణమన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో లోకేశ్ పోస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని