Nara Lokesh: ఏపీ విద్యార్థులు ప్రాణ భయంతో ఉన్నారు.. తక్షణమే తీసుకురండి: నారా లోకేశ్
మణిపుర్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో అక్కడి ఎన్ఐటీలో చదువుతున్న ఏపీ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
అమరావతి: మణిపుర్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో అక్కడి ఎన్ఐటీలో చదువుతున్న ఏపీ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆ విద్యార్థులను తక్షణమే రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు.
మణిపుర్లో తలెత్తిన ఘర్షణలతో అక్కడ అత్యవసర పరిస్థితి విధించారని.. ఇప్పటికే పరస్పర దాడుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారని లోకేశ్ అన్నారు. చాలా జిల్లాల్లో కర్ఫ్యూ అమలవుతోందని చెప్పారు. వివిధ యూనివర్సిటీలు, ఎన్ఐటీల్లో వందలాది మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నారని.. భద్రత విషయమై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వారిని తక్షణమే రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యార్థులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సురక్షితంగా తీసుకొచ్చిందని.. ఏపీ విద్యార్థులు మాత్రం బిక్కుబిక్కుమంటూ మణిపుర్లో ప్రాణభయంతో గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లని విద్యార్థులు ఎలా సంప్రదించగలరని లోకేశ్ ప్రశ్నించారు. కాల్ సెంటర్ల పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ తక్షణమే జోక్యం చేసుకోవాలని.. మణిపుర్ ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర విద్యార్థులను రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
అక్రమ కేసులపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థులను కాపాడటంపై లేదా?: అచ్చెన్న
మణిపుర్లోని తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థులను కాపాడటంపై లేదా? అని మండిపడ్డారు. రంగులు వేయడం, ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ఆపదలో ఉన్న విద్యార్థులను ఆదుకోదా? అని అచ్చెన్న నిలదీశారు. ప్రత్యేక విమానాల్లో తిరిగే సీఎం.. మణిపుర్లో తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఒక విమానం కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వెంటనే వారిని స్వస్థలాలకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు. -
రెండు ప్రభుత్వాల తప్పిదాల వల్లే రైతులకు నష్టం: కొండా విశ్వేశ్వర్రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తోందని, ఆరు గ్యారెంటీలు అసాధ్యమైన హామీలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. -
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. -
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. -
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. -
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM