Bhupathiraju Srinivasa Varma: బీజేపీ వర్మ: సామాన్య కార్యకర్త To కేంద్ర మంత్రిగా..
Bhupathiraju Srinivasa Varma: పార్టీ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
BJP Varma | ఇంటర్నెట్ డెస్క్: నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భూపతి రాజు శ్రీనివాస వర్మగా (Bhupathiraju Srinivasa Varma) కంటే.. బీజేపీ వర్మగా ఆయన ప్రసిద్ధి. అంతగా పార్టీ పేరునే తన పేరుగా మార్చుకున్నారాయన. 34 ఏళ్లుగా పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేస్తూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడ్డారాయన. ఆ విధేయతతోనే పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ప్రజా క్షేత్రంలో భారీ విజయాన్ని అందుకున్నారు. తొలి విజయంలోనే మోదీ కేబినెట్లో సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు.
చాలాకాలం నుంచి భాజపాలో ఉండటంతో ఆయన బీజేపీ వర్మగా స్థానికంగా గుర్తింపు పొందారు. 1967 ఆగస్టు 4న భూపతిరాజు సూర్యనారాయణరాజు, సీత దంపతులకు జన్మించారు. ఆయన భార్య వెంకటేశ్వరి దేవి. వర్మకు సంతానం లేదు. పీజీ వరకు చదువుకున్న ఆయన.. మున్సిపల్ కౌన్సిలర్గా, డీఎన్ఆర్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శిగా, కరస్పాండెంట్గా, భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్గా వ్యవహరించారు.
1980 దశకంలో వామపక్ష విద్యార్థి నాయకుడిగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)లో పని చేశారు. విద్యార్థుల సమస్యలు, ఫీజు విధానాలు, విద్యా సంస్థల్లో సౌకర్యాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు. తర్వాత భాజపా విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. 1991-1997 మధ్య కాలంలో భాజపా భీమవరం పట్టణ, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్గా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2010-2018 మధ్య మరోసారి జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా ఇన్ఛార్జ్జిగా, 2020-23 మధ్య రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అనూహ్యంగా వరించిన అదృష్టం
నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరు కూడా అనూహ్యంగానే తెరపైకి వచ్చింది. తొలుత భాజపా నుంచి రఘురామకృష్ణరాజు పేరు బలంగా వినిపించినా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వర్మ టికెట్ దక్కించుకున్నారు. తెదేపా, జనసేన మద్దతుతో అనూహ్య విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి గూడూరి ఉమాబాలపై భూపతిరాజు శ్రీనివాస వర్మ 2,76,802 ఓట్ల ఆధిక్యం సాధించారు. గతంలో నరసాపురం లోక్సభ స్థానం నుంచి 1999, 2014లలో తెదేపా మిత్రపక్షం తరఫున బరిలో నిలిచిన భాజపా అభ్యర్థులు యూవీ కృష్ణంరాజు, గోకరాజు గంగరాజు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు తెదేపా, జనసేన మద్దతుతో భాజపా అభ్యర్థి అయిన వర్మను విజయం వరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్