NDA vs INDIA bloc: ఎన్డీయే vs ఇండియా కూటమి.. ఏ పార్టీ ఎవరితో..?
NDA vs INDIA bloc: సార్వత్రిక సమరంలో ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు పోటీ చేశాయి. ఇంతకీ ఏ పార్టీ ఏ కూటమిలో ఉంది?
NDA vs INDIA bloc | ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘంగా సాగిన లోక్సభ ఎన్నికలు.. తుది ఘట్టానికి చేరాయి. ఏడు దశల్లో పోలింగ్ జరగ్గా.. రేపటితో (జూన్ 4న) విజేతలెవరో తేలిపోనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ (Exit polls) కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అంచనాలు వెలువరించాయి. ఈ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలో ఎన్డీయే కూటమి (NDA) ఒకవైపు.. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వంటి విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా (INDIA bloc) ఏర్పడి తలపడ్డాయి. ఇంతకీ ఈ కూటముల్లో ఏ పార్టీలున్నాయి? ఏ కూటమిలోనూ చేరని పార్టీలేవి?
ఎన్డీయే కూటమి..
‘ఆబ్కీ బార్ 400 పార్’ అంటూ ఎన్నికల నినాదంతో భారతీయ జనతా పార్టీ (BJP) ఈ సారి ఎన్నికల కదన రంగంలోకి దూకింది. అందుకోసం చిన్న చిన్న పార్టీలను కూడా తన ఎన్డీయే కూటమిలో కలుపుకొంది. ఒంటరిగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కశ్మీర్లోని మూడు స్థానాలకు మినహా దేశవ్యాప్తంగా 540 సీట్లలో పోటీ చేసింది. ప్రస్తుత లోక్సభలో ఎన్డీయే పార్టీల బలం 336 సీట్లుగా ఉంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు గాను 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భాజపా మిత్రులతో కలిసి బరిలో నిలిచింది. మిగిలిన చోట్ల ఒంటరిగా పోటీ చేసింది.
భాజపా తర్వాత తెదేపానే..
ఎన్డీయే కూటమిలో భాజపానే అతిపెద్ద పార్టీ. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ 441 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీనే (TDP) రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. మొత్తం 17 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తుండడం గమనార్హం. ఇవి కాకుండా జేడీయూ (16), ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన (15), తమిళనాడులోని అన్బుమణి రాందాస్ నేతృత్వంలోని పట్టలి మక్కల్ కట్చి (10), లోక్జనశక్తి పార్టీ (5), అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (5) ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. దేవెగౌడకు చెందిన జేడీఎస్ (3), జనసేన (2), అప్నాదళ్ (సోనేలాల్) (2), అసోం గణపరిషత్ (2), నేషనల్ పీపుల్స్ పార్టీ (2), రాష్ట్రీయ లోక్దళ్ (2) వంటి పార్టీలు ఉన్నాయి. ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, హిందుస్థానీ అవామీ మోర్చా, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ మోర్చా, రాష్ట్రీయ సమాజ్ పక్ష, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, యునైటెడ్ పీపుల్స్ లిబరల్ ఒక్కో స్థానం నుంచి పోటీ చేశాయి. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం భాజపా మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఇండియా కూటమి..
మోదీ సర్కారును ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఏకమైన కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో (Congress) యూపీఏ కూటమి ఉండగా.. ఈసారి మరిన్ని పార్టీలతో ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి ఏర్పాటులో నీతీశ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. చివరి నిమిషంలో ఆయన ఎన్డీయే గూటికి చేరడం గమనార్హం. ఇండియా కూటమిలో చిన్న చిన్న విభేదాలు తలెత్తినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు చేసుకుంది. పొత్తులు కుదరని చోట ఆయా పార్టీలు ఒంటరిగా బరిలో నిలిచాయి.
కాంగ్రెస్ తొలిసారి తక్కువ స్థానాల్లో..
మునుపెన్నడూ లేనంత తక్కువగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేసింది. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్ (80), మహారాష్ట్ర (48), బిహార్ (40), తమిళనాడుల్లో (39) మొత్తం 207 స్థానాలు ఉండగా.. వాటిలో కాంగ్రెస్ కేవలం 52 చోట్ల పోటీ చేసింది. అంటే కేవలం 25 శాతం స్థానాలకు పరిమితమైంది. ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్ష పార్టీలకు మెజారిటీ సీట్లు కేటాయించింది. ఇండియా కూటమిలో సమాజ్ వాదీ పార్టీ (62), రాష్ట్రీయ జనతా దళ్ (24), డీఎంకే (22), శివసేన (21), శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (10) ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. వీటితో పాటు తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, వికాశ్శీల్ ఇన్సాన్ పార్టీతో పాటు మరికొన్ని చిన్న చిన్న పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి.
కూటమిలోనే పోటాపోటీ..
ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కొన్ని చోట్ల కొలిక్కి రాకపోవడం, స్థానిక పరిస్థితుల వల్ల కూటమిలో పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి నిలిచాయి. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో దిగాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగా.. ఇక్కడ కాంగ్రెస్, సీపీఎం కలిసి పోటీ చేశాయి. దిల్లీలో పొత్తులో భాగంగా పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్ పంజాబ్లో మాత్రం విడిగా పోటీ చేశాయి.
కూటమి కట్టని పార్టీలు
రెండు ప్రధాన కూటముల మధ్యే పోటీ అయినప్పటికీ.. ఏ కూటమిలోనూ చేరని పార్టీలూ కూడా కొన్ని ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి భారత రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేశాయి. బీఎస్పీ, అన్నాడీఎంకే, బిజూ జనతా దళ్, శిరోమణి అకాలీదళ్, ఎంఐఎం వంటి పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. హరియాణాలోని జన నాయక్ జనతా పార్టీ ఎన్డీయేను చివరి నిమిషంలో వీడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం