Lok Sabha Election Results 2024: ‘ఇండియా’ మెరిపించినా.. ఎన్డీయేకే పీఠం
కాంగ్రెస్ భయపెట్టినా.. సమాజ్వాదీ గట్టి సవాల్ విసిరినా.. తృణమూల్ సత్తా చాటినా.. డీఎంకే దీటుగా ఎదురు నిలబడినా.. ఐదేళ్ల కిందటి స్థాయిలో కాకున్నా.. అఖండ మెజారిటీ రాకున్నా.. కమలం మళ్లీ గెలిచింది!
240 సీట్లు గెల్చుకున్న భాజపా
ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ
మ్యాజిక్ మార్కును దాటిన ఎన్డీయే కూటమి
కేంద్రంలో మూడోసారి సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం
తెలుగుదేశం, జేడీయూలతో కలిసొచ్చిన పొత్తు
మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ!
97 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయభేరి.. మరో 2 చోట్ల ఆధిక్యంలో..
ఉత్తర్ప్రదేశ్లో 37 స్థానాలతో సమాజ్వాదీ హవా
బెంగాల్లో తృణమూల్కే జైకొట్టిన ఓటర్లు
తమిళనాట సీట్లన్నీ ‘ఇండియా’ ఖాతాలోకే..
మధ్యప్రదేశ్లో కమలం క్లీన్స్వీప్
అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో పరాజయం
లోక్సభ ఫలితాల అనంతరం దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన పార్టీ శ్రేణులకు
విజయకేతనం చూపుతున్న ప్రధాని మోదీ. పక్కన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితరులు
కమలం మళ్లీ గెలిచింది!!
కాంగ్రెస్ భయపెట్టినా.. సమాజ్వాదీ గట్టి సవాల్ విసిరినా.. తృణమూల్ సత్తా చాటినా.. డీఎంకే దీటుగా ఎదురు నిలబడినా.. ఐదేళ్ల కిందటి స్థాయిలో కాకున్నా.. అఖండ మెజారిటీ రాకున్నా.. కమలం మళ్లీ గెలిచింది! ఆంధ్ర నాట అపూర్వ విజయం దక్కించుకున్న తెలుగుదేశం అండతో.. బిహార్లో భుజం కలిపిన జేడీయూ మద్దతుతో.. శివసేన (శిందే) సహకారంతో.. ఎల్జేపీ (రాంవిలాస్) చేయూతతో.. కమలం మళ్లీ సాధించింది!
విపక్ష ఇండియా కూటమి కలలను కల్లలుగా మారుస్తూ.. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని ఎన్డీయే ముద్దాడింది. మరో ఐదేళ్లపాటు దేశాన్ని పాలించేందుకు సిద్ధమైంది. ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడో దఫా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా లాంఛనమే! అయితే- ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించలేకపోయినా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి చూపిన పోరాట పటిమ నిస్సందేహంగా ప్రశంసార్హమే! అధికారం దక్కినా.. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో ఓడిపోవడం, సొంతంగా మ్యాజిక్ మార్కును అందుకోలేకపోవడం భాజపాకు నిరాశ కలిగించే అంశాలే!!
‘చార్ సౌ పార్’ నినాదంతో భాజపా జోరు మీదుంది.. ఆ పార్టీ అఖండ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో జోస్యం చెప్పాయి.. ఇలాంటి పరిస్థితుల్లో- మంగళవారం ఉదయం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంలో భాజపాదే స్పష్టమైన పైచేయి! ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే ఆ పార్టీ సొంతంగా 300 మార్కును దాటడం ఇక లాంఛనమే అనిపించింది!! ‘ఇండియా’కు దాదాపుగా రెట్టింపు స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కనిపించారు. కానీ ఒక్కో రౌండ్ గడిచేకొద్దీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మధ్యాహ్నానికల్లా ఎన్డీయే వైపు తగ్గుతూ.. ‘ఇండియా’ వైపు సీట్లు పెరిగాయి. పోరు రసవత్తరంగా మారింది. ఫలితంపై ఉత్కంఠ అంతకంతకూ పెరిగింది. ముఖ్యంగా తనకు కంచుకోటల్లాంటి ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, హరియాణాల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బలు తగలడం సర్వత్రా ఆసక్తి పెంచింది. అనూహ్య ఫలితమేమైనా రాబోతోందా అన్న ప్రశ్న కోట్లమంది మదిలో మొదలైన క్షణాలవి. అయితే మధ్యప్రదేశ్ను క్లీన్స్వీప్ చేయడంతోపాటు గుజరాత్లో పాతిక స్థానాలు దక్కడంతో కమలనాథులు ఊపిరి పీల్చుకున్నారు! హిందీ బెల్ట్లో అనూహ్యంగా తగ్గిన స్థానాల సంఖ్యను.. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో మెరుగైన ఫలితాలతో కొంతమేరకు పూడ్చుకోగలిగారు. ఫలితంగా భాజపా 240 స్థానాలతో అధికార పీఠానికి చేరువకాగలిగింది. దాని మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన (శిందే వర్గం)ల అండతో ఎన్డీయే మరో దఫా పాలనా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
దిల్లీ: యావత్ భారతావనిని ఉత్కంఠతో ఊపేసిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భాజపాదే పైచేయి అయింది. 240 స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. ఇండియా కూటమి 231 నియోజకవర్గాల్లో గెలిచి, 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. దేశంలోకెల్లా ఏకైక అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్కు (272)ను మాత్రం అది అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో భాజపా కేంద్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు తన మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), శివసేన (శిందే వర్గం) వంటి పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తవడం, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భాజపా ఉత్సాహంగా ఈ ఎన్నికల బరిలో దిగింది. 400 స్థానాలను గెల్చుకోవడమే లక్ష్యమంటూ ‘చార్ సౌ పార్’ నినాదమిచ్చింది. అయితే ఆ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోయింది. మోదీ రాజకీయాల్లోకి వచ్చాక.. అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం ఇదే తొలిసారి. భాజపా సొంతంగా 2019లో 303, 2014లో 282 సీట్లు గెల్చుకుంది.
మధ్యప్రదేశ్, గుజరాత్లలో హవా.. యూపీ, రాజస్థాన్లలో బోల్తా
ఎప్పట్లాగే మధ్యప్రదేశ్, గుజరాత్లలో భాజపా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మధ్యప్రదేశ్లోని 29 స్థానాలను క్లీన్స్వీప్ చేసిన పార్టీ.. గుజరాత్లో 25 చోట్ల జయభేరి మోగించింది. ఒడిశాలో ఏకంగా 20 స్థానాలను తన ఖాతాలో వేసుకొని ఔరా అనిపించింది. బిహార్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీయూ 12 సీట్లతో సత్తాచాటింది. అక్కడ భాజపా కూడా డజను స్థానాలు దక్కించుకుంది. దిల్లీలోని ఏడు స్థానాలూ కమలం ఖాతాలోకే వెళ్లాయి. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ కూడా ఆ పార్టీకే జైకొట్టాయి. అయితే దేశంలోకెల్లా అత్యధికంగా 80 లోక్సభ స్థానాలున్న యూపీలో, తనకు పట్టున్న రాజస్థాన్లో కమలదళానికి తీవ్ర నిరాశ ఎదురైంది. 2019లో 62 సీట్లు గెల్చుకున్న యూపీలో ఈసారి సమాజ్వాదీ పార్టీ (37) కంటే వెనకబడి 33 స్థానాలకు పరిమితమైంది. రాజస్థాన్లో మొత్తం 25 సీట్లు ఉండగా.. కేవలం 14 చోట్ల గెలిచింది. హరియాణాలోని పది సీట్లను ఐదేళ్ల కిందట క్లీన్స్వీప్ చేసిన పార్టీ.. ఈసారి సగం స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలో ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), శివసేన (శిందే వర్గం)లతో జట్టు కట్టిన భాజపాకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. మోదీ వారణాసిలో హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 2019 నాటి(4.79 లక్షలు)తో పోలిస్తే ఈసారి ఆయన చాలా తక్కువగా 1.52 లక్షల ఓట్ల ఆధిక్యంతో సరిపెట్టుకున్నారు.
దక్షిణ భారత్లో ఈసారి గణనీయ ఫలితాలు సాధిస్తామంటూ ముందునుంచీ బలంగా చెప్పిన భాజపా నిరాశకు గురికాక తప్పలేదు. తమిళనాట ఆ పార్టీ బోణీ కూడా కొట్టలేకపోయింది. అక్కడి 39 సీట్లూ ‘ఇండియా’ ఖాతాలోకే వెళ్లాయి. అందులో డీఎంకే వాటా 22 కాగా, కాంగ్రెస్ వాటా 9. దక్షిణాదిలో తనకు మంచి పట్టున్న రాష్ట్రమైన కర్ణాటకలో 28 స్థానాలకుగాను కేవలం 17 సీట్లలోనే విజయం సాధించింది. కాంగ్రెస్, వామపక్షాలకు కంచుకోటలాంటి కేరళలో బోణీ కొట్టడం కమలదళానికి కాస్త ఊరటనిచ్చే విషయం.
కాంగ్రెస్కు పునరుజ్జీవం
రాయ్బరేలీ, వయనాడ్ స్థానాల నుంచి గెలుపొందిన అనంతరం దిల్లీలో సోనియాగాంధీ,
మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంకాగాంధీలతో కలిసి విజయకేతనం చూపుతున్న రాహుల్గాంధీ
గత రెండు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించలేకపోయిన కాంగ్రెస్ ఈసారి స్ఫూర్తిదాయక ఫలితాలు సాధించింది. కడపటి వార్తలందే సమయానికి 97 స్థానాల్లో గెలిచి, మరో 2 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హస్తం పార్టీ కేరళలో 14 సీట్లతో సత్తాచాటింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, హరియాణాల్లో మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తాను పోటీ చేసిన రెండుచోట్లా విజయం సాధించారు. వయనాడ్లో 3.64 లక్షలు, రాయ్బరేలీలో 3.90 లక్షల ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నారు. సార్వత్రిక సమరంలో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) పెద్దగా ప్రభావం చూపలేదు. పంజాబ్లో 3 సీట్లు గెల్చుకున్న ఆ పార్టీ.. దిల్లీలో ఖాతా తెరవలేకపోయింది.
బెంగాల్లో దీదీ దూకుడు
ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కంటే భాజపా ఎక్కువ సీట్లు సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. రాష్ట్రంపై తన పట్టును మరింత పదిలం చేసుకుంటూ తృణమూల్ 29 సీట్లు గెల్చుకుంది. కమలనాథులు 12 స్థానాలకే పరిమితమయ్యారు. మొత్తంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీల పునరుత్థానాన్ని గట్టిగా చాటిచెప్పాయి.
ఎన్డీయే ప్రభుత్వంపై వరుసగా మూడోసారి విశ్వాసం ఉంచుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఓటరు దేవుళ్లు చూపించిన ఈ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు గత దశాబ్దకాలంగా చేస్తోన్న మంచి పనులన్నింటినీ ఇకపైనా కొనసాగిస్తానని హామీ ఇస్తున్నా. ఎన్డీయే విజయం కోసం శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు. వారి అవిరళ కృషిని మాటల్లో వివరించలేను.
ప్రధాని మోదీ
రాజ్యాంగ పరిరక్షణ కోసం అతిపెద్ద తొలి అడుగు పడింది. పేదలు, అణగారిన వర్గాలవారే ఇందులో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం తెదేపా, జేడీయూ వంటి మాజీ భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై‘ఇండియా’ కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం.
రాహుల్ గాంధీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి