AP Elcetion Results: లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల ముందంజ

ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

Published : 04 Jun 2024 09:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్‌నాయుడు (తెదేపా), అనకాపల్లిలో సీఎం రమేశ్‌ (భాజపా), రాజమహేంద్రవరంలో దగ్గుబాటి పురందేశ్వరి (భాజపా), విజయవాడలో కేశినేని చిన్ని (తెదేపా) ముందంజలో ఉన్నారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్‌ (తెదేపా), నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (తెదేపా) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని