LS polls: ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో..నిర్మలమ్మ, జైశంకర్
LS polls: కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జై శంకర్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రస్తుతం వారిద్దరు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
దిల్లీ: కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman), ఎస్ జైశంకర్(S Jaishankar) త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు మరో మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు వెల్లడించారు. అయితే వారు ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారనేదానిపై భాజపా అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
‘ఈ విషయంపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారు లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే విషయం దాదాపుగా ఖరారైంది. అయితే వారు ఏఏ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతారనేది ఇంకా ఖరారుకాలేదు’ అని జోషి వెల్లడించారు. వారు పోటీ చేసే స్థానాల్లో బెంగళూరు ఉంటుందా..? అని అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ‘ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పుడు నేనెలా సమాధానం చెప్పగలను..?’ అని అన్నారు.
ప్రస్తుతం జై శంకర్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. సీతారామన్ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వారిద్దరు గుజరాత్, కర్ణాటక నుంచి రాజ్యసభలో ఎంపీలుగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM