Nirmala Sitharaman: భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Published : 29 Apr 2024 12:12 IST

విశాఖ: లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370.. ఎన్డీయే పక్షాలతో కలిసి 400పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆమె పర్యటించారు. దీనిలో భాగంగా గీతం వర్సిటీలో ‘వికసిత్‌ భారత్‌’ కార్యక్రమం కింద విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. తాము గెలిచే స్థానాల సంఖ్య స్థిర నిర్ణయాల అమలుకు దోహదం చేస్తుందన్నారు. వికసిత్‌ భారత్‌ అంబాసిడర్లుగా యువతదే కీలక పాత్ర అని చెప్పారు. కొత్త ఆవిష్కరణల కోసం కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. రూ.22 వేల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు. కృత్రిమ మేధ ఆవిష్కరణల్లో భారత్‌ అగ్రగామిగా ఉందని నిర్మలా సీతారామన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని