Venkaiah Naidu: ఎన్టీఆర్‌ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారు: వెంకయ్య నాయుడు

తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు.

Updated : 28 May 2024 09:33 IST

హైదరాబాద్‌: తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. ‘తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌. పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారు. రాజకీయాల్లోనూ నవశకానికి నాంది పలికారు. ఎన్టీఆర్‌ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారు. నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచారు. గొప్ప సంస్కరణ వాది’’ అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ ఒక సంచలనం

‘‘ఎన్టీఆర్‌ అంటే ఒక పేరు, ఒక వ్యక్తి కాదు.. ఒక సంచలనం. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టి నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు తెచ్చారు. చిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా నటించారు’’- పురందేశ్వరి, భాజపా ఏపీ అధ్యక్షురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని