Pawan Kalyan: థియేటర్ల వద్ద డ్యూటీలు వేస్తారు.. పింఛన్ల పంపిణీకి సిబ్బంది లేరా?: పవన్
పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులు, దివ్యాంగులకు తోడుగా ఉండాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
అమరావతి: పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులు, దివ్యాంగులకు తోడుగా ఉండాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ‘‘మీ వాహనాలపై జాగ్రత్తగా కార్యాలయానికి తీసుకెళ్లి పింఛను ఇప్పించి.. తిరిగి ఇంటి వద్ద దించండి. సామాజిక బాధ్యతగా తీసుకొని సాయం చేయాలి. జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన తెదేపా, భాజపా నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నా.
ఏపీ సీఎస్ గారూ.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి. నా సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు.. తహసీల్దార్ ఫోన్ నంబరు ఇస్తారు. కానీ, పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? కరోనా కాలంలో మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులకు డ్యూటీలు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పింఛన్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దే ఇవ్వొచ్చు. వైకాపా నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్కి ప్రభుత్వ నిర్ణయాలు బలం చేకూరుస్తున్నాయి’’ అని ట్వీట్ చేశారు. గతంలో సినిమా థియేటర్స్ వద్ద రెవెన్యూ అధికారులకు విధులు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీని పవన్ పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా