Pawan Kalyan: పవన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం

కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెదేపా నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 

Published : 20 Apr 2024 15:50 IST

పిఠాపురం: కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెదేపా నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ నాయకులను ఇన్‌ఛార్జి వర్మ.. పవన్‌కు పరిచయం చేశారు. అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కలిసి పనిచేయాలని నాయకులు సంకల్పం చేశారు. ‘‘పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నా. నన్ను చాలా గౌరవిస్తున్నారు.. ఆయన రుణం తీర్చుకుంటా. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమనే ఆయనకు మద్దతిచ్చా’’ అని పవన్‌ తెలిపారు.

పవన్‌ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు వేదికపైకి చొచ్చుకొచ్చారు. భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని అదుపు చేయలేపోయారు. పదే పదే మైక్‌ ఆగి పోవడంతో ప్రసంగానికి అంతరాయమేర్పడింది. అభిమానులు, తెదేపా శ్రేణులను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. దీంతో సమావేశం ముగించి.. జనసేనాని చేబ్రోలు బయలుదేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు