Pawan kalyan: అధికారం కోసమైతే నేను ఇంతలా కష్టపడాల్సిన పనిలేదు: పవన్ కల్యాణ్
ఆరో రోజు వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ఏటిమొగ్గలో ఆయన పర్యటించారు.
కాకినాడ: ఆరో రోజు వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ఏటిమొగ్గలో ఆయన సోమవారం పర్యటించారు. ప్రత్యేక బోటులో ఉప్పుటేరు మీదుగా వెళ్లి స్థానిక జాలరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాలరులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. చేపల వేట విరామం వేళ ప్రభుత్వ జీవన భృతి అందడం లేదని వాపోయారు. చమురు పరిశ్రమల వల్ల నష్టపోతున్నామని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
జాలరులతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘నేను ఎంతో నిబద్ధతతో జనసేన పార్టీని ప్రారంభించా. అధికారమే అంతిమ లక్ష్యం అనుకుంటే ఇంత కష్టపడాల్సిన పనిలేదు. నాకు ఉన్న సామర్థ్యానికి ఏదో పదవి పొందొచ్చు. ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. ఈ సీఎంలాగా అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదు. బటన్ నొక్కితే డబ్బులు పడతాయని కూడా చెప్పను. ఉప కులాల మధ్య ఐక్యత ఉండాలి. సరైన వ్యక్తులను మీరు నమ్మడం లేదు. బతికే హక్కు అందరికీ ఉంది. దానికి భంగం కలిగినప్పుడు పోరాడాల్సిందే. మీ విశ్వాసం సరైన వ్యక్తులపై పెట్టడం లేదు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించండని అభ్యర్థిస్తున్నా.
రాష్ట్రంలోని ఇసుకంతా పెద్దిరెడ్డికి చెందిన మూడు కంపెనీలకే వెళ్లిపోతోంది. ఆ ఇసుక విలువ ఎంత లేదన్నా.. రూ. 10వేల కోట్లు ఉంటుంది. అది అంతా ఒక్కరి వద్దకే వెళ్తోంది. మీరు నాకు అండగా ఉంటే మీ సమస్యలను కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. మీ బాధలు వారికి వినిపిస్తా. మీ ఆరోగ్యం, ఉపాధి కోసం సంపూర్ణంగా కృషి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు మీ కష్టం, మీ రక్తం, శ్రమ ద్వారా రూ.వేల కోట్లు సమకూరుతోంది. మీ ఆదాయాన్ని ఇంకెవరో దోచేస్తున్నారు. మీరు నా కోసం నిలబడితే నేను మీ కోసం పోరాటం చేస్తా. నేను ఎవరితోనూ కుమ్మక్కవడం లేదు. నాకు ఎవరితోనూ కాంట్రాక్ట్లు లేవు. ఎలాంటి వ్యాపారాలూ లేవు. చమురు సంస్థలతో మాట్లాడతా. బీసీ కులాలపై అధ్యయనం చేసి వచ్చాను. మీరు మద్దతు ఇవ్వండి.. అండగా ఉంటా’’ అని జనసేనాని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు. -
రెండు ప్రభుత్వాల తప్పిదాల వల్లే రైతులకు నష్టం: కొండా విశ్వేశ్వర్రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తోందని, ఆరు గ్యారెంటీలు అసాధ్యమైన హామీలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. -
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. -
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. -
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. -
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు