Pemmasani Chandrashekar: ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతే ఉదాహరణ: పెమ్మసాని
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
గుంటూరు: ఏపీ రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. రాజధాని అభివృద్ధికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను జగన్ ధ్వంసం చేశారని, 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఇక్కడికి వస్తే వాటిని అడ్డుకున్నారని విమర్శించారు.
‘‘రాజధాని అమరావతిలో జరిగిన విధ్వంసం చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. రాజధాని కోసం 20వేల మంది సన్న చిన్న కారు రైతులు భూములు ఇచ్చారు. అభివృద్ధి కోసం ఖర్చు చేసిన రూ.10వేల కోట్లు వృథా అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆర్ 5 జోన్ పేరిట అభివృద్ధి కారిడార్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. బయటి ప్రాంతాల ప్రజలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు. రాజధాని నిర్మాణం జరిగితే ఉపాధి లభించేది. కానీ, 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అంబేడ్కర్ స్మృతి వనం కోసం కేటాయించిన ప్రాంతాన్ని నాశనం చేసి.. మరో చోట విగ్రహం ఏర్పాటు చేశారు. ఒక ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతి ప్రత్యక్ష ఉదాహరణ’’అని పెమ్మసాని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. -
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM