PM Modi: మహబూబ్‌నగర్‌ చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌ చేరుకున్నారు. తొలుత శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా మహబూబ్‌నగర్‌ వచ్చారు.

Published : 01 Oct 2023 14:39 IST

మహబూబ్‌నగర్‌: ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌ చేరుకున్నారు. తొలుత శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా మహబూబ్‌నగర్‌ వచ్చారు. మహబూబ్‌నగర్‌ సమీపంలోని భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌లో నిర్వహించే అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్‌ పద్ధతిలో చేయనున్నారు. 

కాసేపట్లో భాజపా ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించనున్న ‘పాలమూరు ప్రజాగర్జన’ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సభతో శాసనసభ ఎన్నికల సమర శంఖాన్ని భాజపా పూరించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని