PM Modi: అన్నామలై, తమిళిసైతో కలిసి ప్రధాని మోదీ రోడ్‌ షో (వీడియో)

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలో రోడ్‌షో నిర్వహించారు.

Updated : 09 Apr 2024 20:13 IST

చెన్నై: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చెన్నైలోని టి.నగర్‌ ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు పెద్దఎత్తున నిలబడి పూల వర్షంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్లకార్డులు పట్టుకొని మోదీ అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేకంగా అలంకరించిన కారు నుంచి మద్దతుదారులకు ప్రధాని అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు. వాహనంలో ఆయన వెంట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై, చెన్నై సౌత్‌ అభ్యర్థి తమిళి సైతో పాటు మరికొందరు అభ్యర్థులు ఉన్నారు. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఈనెల 19న పోలింగ్‌ జరగనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు