Raghunandan Rao: ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్పై గవర్నర్కు రఘునందన్ ఫిర్యాదు
రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను భాజపా నేత రఘునందన్ రావు కలిశారు.
హైదరాబాద్: రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత రఘునందన్ రావు కలిశారు. భారాస కండువా వేసుకొని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య ఎన్నికల ప్రచారం చేశారని గవర్నర్కు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్భవన్ వెలుపల మీడియాతో రఘునందన్ మాట్లాడారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఎన్నికల ప్రచారం చేసిన బక్కి వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. తప్పకుండా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.