Amit Shah: రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు: అమిత్ షా
‘‘రాహుల్ గాంధీ నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మందిని జైల్లో పెట్టారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత రాహుల్కు లేదు.’’అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తీవ్ర విమర్శలు చేశారు.
జోధ్పూర్: ‘‘రాహుల్ గాంధీ నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మందిని జైల్లో పెట్టారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత రాహుల్కు లేదు.’’అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తీవ్ర విమర్శలు చేశారు.
ఆదివారం దిల్లీలోని రాంలీలా మైదాన్లో లోక్తంత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) అనే నినాదంతో ప్రతిపక్ష ఇండియా కూటమి ర్యాలీ చేయడంపై షా అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఏమైందని సేవ్ డెమోక్రసీ అంటున్నారు. రూ.12 లక్షల మేర కుంభకోణాలు చేస్తేనే కదా మీ నాయకులు జైలుకు వెళ్లింది అని ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు కలిసినా మళ్లీ మోదీనే ప్రధానిగా గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆయన తదుపరి పాలనలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందన్నారు.
యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. పదేళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వ పాలనలో మన్మోహన్సింగ్, సోనియాగాంధీలు దేశాన్ని అంధకారంలోకి నెట్టారని అమిత్షా మండిపడ్డారు. 2014లో ప్రజలు మోదీకి అధికారం కట్టబెట్టిన అనంతరం ఆయన దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారన్నారు. యూపీఏ హయాంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చారని వ్యాఖ్యానించారు. రామమందిరం నిర్మాణాన్ని ఎత్తిచూపిన ఆయన, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించలేకపోయారని విమర్శించారు. 150 ఏళ్ల నాటి చట్టాలను, 100 ఏళ్ల నాటి పార్లమెంట్ భవనాన్ని మార్చామని హోంమంత్రి అన్నారు. దేశ భద్రత గురించి అనేక చర్యలు తీసుకుంటున్నామని భాజపా హయాంలో భారత్లో బాంబుపేలుళ్లకు ఎవరూ సాహసించడం లేదని తెలిపారు.
లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి భాజపా 370 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2014లో భాజపా 55శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిందని, అనంతరం 2019లో 61శాతం ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఈసారి 70శాతం ఓట్లతో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని తెలిపారు. ‘‘మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. ప్రస్తుతం దేశంలో ప్రతీ వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోంది. ప్రతిరోజూ రూ.16,000 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. 14 కి.మీ. రహదారులను నిర్మిస్తున్నారు. ప్రతీ సెకనుకు ఒక ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడానికి మేము కృషి చేస్తున్నాము.’’అని తెలిపారు.
‘‘సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మమతాబెనర్జీ తన మేనల్లుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలాగే అశోక్ గెహ్లాట్, లాలూ యాదవ్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే తమ కుమారులు సీఎంలు కావాలని ప్రయత్నిస్తున్నారు. భాజపా అలాంటి వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహించదు’’అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!