Amit Shah: రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు: అమిత్ షా
‘‘రాహుల్ గాంధీ నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మందిని జైల్లో పెట్టారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత రాహుల్కు లేదు.’’అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తీవ్ర విమర్శలు చేశారు.
జోధ్పూర్: ‘‘రాహుల్ గాంధీ నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మందిని జైల్లో పెట్టారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత రాహుల్కు లేదు.’’అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తీవ్ర విమర్శలు చేశారు.
ఆదివారం దిల్లీలోని రాంలీలా మైదాన్లో లోక్తంత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) అనే నినాదంతో ప్రతిపక్ష ఇండియా కూటమి ర్యాలీ చేయడంపై షా అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఏమైందని సేవ్ డెమోక్రసీ అంటున్నారు. రూ.12 లక్షల మేర కుంభకోణాలు చేస్తేనే కదా మీ నాయకులు జైలుకు వెళ్లింది అని ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు కలిసినా మళ్లీ మోదీనే ప్రధానిగా గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆయన తదుపరి పాలనలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందన్నారు.
యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. పదేళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వ పాలనలో మన్మోహన్సింగ్, సోనియాగాంధీలు దేశాన్ని అంధకారంలోకి నెట్టారని అమిత్షా మండిపడ్డారు. 2014లో ప్రజలు మోదీకి అధికారం కట్టబెట్టిన అనంతరం ఆయన దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారన్నారు. యూపీఏ హయాంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చారని వ్యాఖ్యానించారు. రామమందిరం నిర్మాణాన్ని ఎత్తిచూపిన ఆయన, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించలేకపోయారని విమర్శించారు. 150 ఏళ్ల నాటి చట్టాలను, 100 ఏళ్ల నాటి పార్లమెంట్ భవనాన్ని మార్చామని హోంమంత్రి అన్నారు. దేశ భద్రత గురించి అనేక చర్యలు తీసుకుంటున్నామని భాజపా హయాంలో భారత్లో బాంబుపేలుళ్లకు ఎవరూ సాహసించడం లేదని తెలిపారు.
లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి భాజపా 370 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2014లో భాజపా 55శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిందని, అనంతరం 2019లో 61శాతం ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఈసారి 70శాతం ఓట్లతో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని తెలిపారు. ‘‘మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. ప్రస్తుతం దేశంలో ప్రతీ వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోంది. ప్రతిరోజూ రూ.16,000 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. 14 కి.మీ. రహదారులను నిర్మిస్తున్నారు. ప్రతీ సెకనుకు ఒక ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడానికి మేము కృషి చేస్తున్నాము.’’అని తెలిపారు.
‘‘సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మమతాబెనర్జీ తన మేనల్లుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలాగే అశోక్ గెహ్లాట్, లాలూ యాదవ్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే తమ కుమారులు సీఎంలు కావాలని ప్రయత్నిస్తున్నారు. భాజపా అలాంటి వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహించదు’’అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!