Rahul Gandhi: వయనాడ్లో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వయనాడ్ నుంచి నామినేషన్ వేశారు. ఈ ప్రాంత ప్రజలు తనను సొంతవ్యక్తిలా చూసుకున్నారని అన్నారు.
వయనాడ్: లోక్సభ ఎన్నికల్లో తన సిటింగ్ స్థానం వయనాడ్(కేరళ) నుంచి పోటీచేస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన తన నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించారు. తన సోదరి ప్రియాంకా గాంధీ వెంటరాగా ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో భారీ సంఖ్యలో మద్దతుదారులు రాహుల్ చిత్రాలను ప్రదర్శిస్తూ వారిని అనుసరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వయనాడ్లో ప్రతివ్యక్తి నాకు ప్రేమ, అభిమానాన్ని అందించారు. సొంత వ్యక్తిలా చూసుకున్నారు. ఈ ప్రాంతం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గౌరవంగా భావిస్తున్నాను. మిమ్మల్ని నేను ఓటర్లుగా భావించను. నా సోదరి ప్రియాంక గురించి ఎలా ఆలోచిస్తానో మీ గురించి అంతే. అందుకే వయనాడ్లో నాకు సోదరీమణులు, తల్లులు, సోదరులు ఉన్నారు’ అని పేర్కొన్నారు. హస్తం పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ రాహుల్ ప్రసంగాన్ని అనువదించారు.
ఇలా పార్టీలోకి వచ్చి... అలా టికెట్ పట్టేసి
2019 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్.. సమీప అభ్యర్థి పి.పి.సునీర్ (సీపీఐ)పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి సీపీఐ తరఫున అనీ రాజా ఇక్కడ పోటీ చేస్తున్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీ అయిన సీపీఐ అక్కడ అభ్యర్థిని దించడం చర్చనీయాశంమైంది. ఈ రోజే అనీ రాజా కూడా నామినేషన్ వేశారు. మరోపక్క భాజపా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ను బరిలో దింపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్