Rahul Gandhi: గంగపుత్రులపై రాహుల్ హామీల వర్షం.. లీటరు డీజిల్పై ₹25 రాయితీ.. ఇంకా..!
Karnataka Elections:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మత్స్యకారులపై హామీల వర్షం కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. రూ.10లక్షల బీమా సౌకర్యంతో పాటు వడ్డీ లేకుండా రూ.లక్ష రుణం, లీటరు డీజిల్పై రూ.25ల చొప్పున రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఉడుపి: కర్ణాటక ఎన్నిక(Karnataka Elections)ల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో భాజపా, కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు అనేక హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా ఉడుపి జిల్లాలోని కాపు ప్రాంతంలో మత్స్యకారులతో సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వారిపై హామీల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే.. గంగపుత్రులకు రూ.10లక్షల బీమా సౌకర్యంతో పాటు వడ్డీ లేకుండా రూ.లక్ష రుణం, రోజుకు 500 లీటర్ల వరకు ఒక్కో లీటరు డీజిల్పై రూ.25ల చొప్పున రాయితీ అందించనున్నట్టు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా భాజపా పాలనపై విమర్శలు గుప్పించారు. అవినీతి, ధరల పెరుగుదల మత్స్యకారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయన్నారు. అలాగే, బ్యాంకు రుణాలు పొందడం కూడా వారికి కష్టంగా మారిందని ఆరోపించారు. చేపల సంఖ్య తగ్గిపోతుండటం, ఖర్చులు పెరిగిపోవడంతో వేట కష్టంగా మారిందన్నారు. అందుకే మత్స్యకారులకు ఉపశమనం కలిగించే చర్యలపై కాంగ్రెస్ దృష్టిపెడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ తొలి కేబినెట్ సమావేశంలోనే అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ కేవలం హామీలు మాత్రమే ఇవ్వదని.. వాటిని తొలి రోజు నుంచే అమలు చేస్తుందని చెప్పారు. కర్ణాటక ఎన్నికలను రెండు సిద్ధాంతాల మధ్య పోటీగా అభివర్ణించిన రాహుల్.. తమ పార్టీ పేదలు, అట్టడుగు వర్గాల కోసమే పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న భాజపా సర్కార్ ప్రజలు ఎన్నుకున్నది కాదని.. రూ.కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్ల ఏర్పాటైందంటూ దుయ్యబట్టారు. సీఎం పోస్టును రూ.2,500 కోట్లకు అమ్మారంటూ భాజపా ఎమ్మెల్యేలే చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం ఏ పని జరగాలన్నా 40శాతం కమీషను డిమాండ్ చేస్తున్నారంటూ కాంట్రాక్టర్ల అసోసియేషనే ఫిర్యాదు చేసిందన్నారు. ఉపాధ్యాయులు, పోలీసులు, అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకాల్లో సైతం అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రజాధనాన్ని ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు ఖర్చు చేయకుండా కేవలం మిలియనీర్లైన తమ స్నేహితులకే భాజపా ఖర్చు చేస్తోందన్నారు.
మరోవైపు, మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక హామీలు ఇచ్చింది. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్(గృహజ్యోతి), మహిళలకు నెలకు రూ.2వేల సాయం (గృహలక్ష్మీ), దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ 10కిలోల వరకు ఉచిత బియ్యం (అన్న భాగ్య), గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి రూ.3వేలు చొప్పున , డిప్లొమా చేసినవారికి (18-25 ఏళ్ల మధ్య ) రెండేళ్ల వరకు రూ.1500 చొప్పున సాయం అందించనున్నట్టు గతంలోనే హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. మే 10న కర్ణాటక ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు ప్రభుత్వాల తప్పిదాల వల్లే రైతులకు నష్టం: కొండా విశ్వేశ్వర్రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తోందని, ఆరు గ్యారెంటీలు అసాధ్యమైన హామీలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. -
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. -
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. -
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. -
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్