Ravela Kishore Babu: వైకాపాకు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా

వైకాపాకు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా చేశారు. లేఖను ఆ పార్టీ అధినేత జగన్‌కు పంపారు.

Updated : 07 Jun 2024 15:15 IST

అమరావతి: వైకాపాకు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా చేశారు. లేఖను ఆ పార్టీ అధినేత జగన్‌కు పంపారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు గతంలో తెదేపా అధినేత చంద్రబాబు అద్భుతమైన అవకాశం ఇచ్చారని.. ఆయన నాయకత్వంలో మంత్రిగా పనిచేశానని చెప్పారు. దురదృష్టవశాత్తూ కొన్ని కారణాలతో తెదేపాలో కొనసాగలేకపోయినందుకు ఎల్లప్పుడూ బాధ పడుతూనే ఉంటానన్నారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదని చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వైకాపాతోనే సాధ్యమని భ్రమించి అందులో చేరానన్నారు. ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. సంక్షేమం, సమగ్ర రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమని నమ్మి కూటమికి చరిత్రాత్మక విజయం కట్టబెట్టారన్నారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఓ పక్క సమాజసేవ చేస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం తన వంతు ప్రయత్నాలు చేయాలని వైకాపాకు రాజీనామా చేసినట్లు కిశోర్‌బాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని