Ajit Pawar: ‘2024 వరకు ఎందుకు..?’ సీఎం పదవిపై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం మహారాష్ట్ర (Maharashtra)రాజకీయాల్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) కదలికలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్ని వివరణలు వచ్చినప్పటికీ.. ఆయన భాజపాతో చేతులు కలుపుతారా..? అనే ప్రశ్నలు మాత్రం ఆగడం లేదు.
పుణె: ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar)రాజకీయంగా ఎలాంటి స్టెప్ వేయనున్నారనే వార్తలు.. ఇప్పుడు మహారాష్ట్ర(Maharashtra)లో ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి గురించి ఆయన ఓ మీడియాకు ఇచ్చిన సమాధానమే అందుకు కారణం.
మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? అని అజిత్ పవార్(Ajit Pawar)ను అడగ్గా..‘వందశాతం అనుకుంటున్నా’ అంటూ టక్కున సమాధానం ఇచ్చారు. గత 20 ఏళ్లలో ఎన్సీపీ ఉపముఖ్యమంత్రి పదవికి పరిమితం కావడంపై ప్రశ్నించగా.. ‘2004లో ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ పడ్డాయి. మేం 71 సీట్లు గెల్చుకోగా.. కాంగ్రెస్కు 69 వచ్చాయి. కాంగ్రెస్తో సహా అంతా సీఎం పదవి ఎన్సీపీదే అనుకున్నారు. కానీ ఈ పదవులపై దిల్లీలో నిర్ణయం తీసుకున్నారు. హస్తం పార్టీకి సీఎం, ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి అని సందేశం వచ్చింది. మా పార్టీ నేత ఆర్ఆర్ పాటిల్ను శాసనసభాపక్ష నేతగా ఎంచుకున్నాం. ఎన్సీపీ(NCP)కి సీఎం పదవి ఇచ్చుంటే.. ఆయనే సీఎం అయ్యేవారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆటోమేటిక్గా ఆ పార్టీకే సీఎం పదవి దక్కింది’ అని సమాధానమిచ్చారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ(NCP) ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతుందా? అని ప్రశ్నించగా.. ‘2024 వరకు ఎందుకు? మేం ఇప్పుడు కూడా ఆ పదవి పొందేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. అది ఎలా..?ఏంటి..?అనేది మాత్రం వివరించలేదు. ఇదిలా ఉంటే.. అజిత్(Ajit Pawar) తన మద్దతుదారులతో కలిసి భాజపాలో చేరతారనే ఊహాగానాలు ఇటీవల వినిపిస్తున్నాయి. ఆ వార్తలను ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అజిత్ తోసిపుచ్చినా అవి ఆగకపోవడం గమనార్హం. తాజాగా ఆయన పార్టీ సమావేశానికి గైర్హాజరుకావడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. -
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. -
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. -
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?