Sreenivasa varma: భాజపాలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు: నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ

కేంద్రమంత్రివర్గంలో తనకు చోటు కల్పించడం పట్ల నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు.

Published : 09 Jun 2024 17:40 IST

దిల్లీ: కేంద్రమంత్రివర్గంలో తనకు చోటు కల్పించడం పట్ల నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘భాజపా కార్యకర్తగా నా జీవితం ప్రారంభమైంది. గత 34 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నాను. నా రాజకీయ ప్రయాణంలో సహకరించిన, ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు. నరసాపురం టికెట్‌ నాకు దక్కినప్పుడు కార్యకర్తలంతా నా విజయాన్ని కాంక్షించారు. రాయలసీమ నుంచి కూడా పలువురు తరలివచ్చి ప్రచారం నిర్వహించారు. కూటమిలోని మూడు పార్టీల నాయకులు నా గెలుపు కోసం కృషి చేశారు. కష్టపడి పనిచేస్తే పార్టీలో గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి ఈ పదవి ఓ నిదర్శనం’’ అని వర్మ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని